ప్రధాన మంత్రి కార్యాలయం
45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ కేటగిరీలో, మహిళల కేటగిరీలో స్వర్ణ పతకాలను
గెలిచిన భారతీయ క్రీడాకారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు
प्रविष्टि तिथि:
23 SEP 2024 1:15AM by PIB Hyderabad
45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలను గెలిచిన క్రీడాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పురుషుల, మహిళల చదరంగం టీమ్ లను ఆయన అభినందించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘45వ ఎఫ్ఐడిఇ చదరంగం ఒలింపియాడ్ (#FIDE Chess Olympiad)లో మన చదరంగం క్రీడాకారుల జట్లు గెలవడం భారతదేశానికి లభించిన చరిత్రాత్మక విజయం. చెస్ ఒలింపియాడ్ లో ఓపెన్, మహిళల కేటగిరీల్లో భారతదేశం స్వర్ణ పతకాలను గెలుచుకొంది. పురుషుల, మహిళల చదరంగం జట్లకు నా అభినందనలు. ఈ ప్రశంసనీయ కార్యసాధన భారతదేశ క్రీడాచరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. చదరంగం క్రీడాకారులు మరిన్ని శిఖరాలను అందుకునేందుకు ఈ విజయం స్ఫూర్తిని అందిస్తుందని భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2058069)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Punjabi
,
Gujarati