ప్రధాన మంత్రి కార్యాలయం

లేగదూడకు ‘దీప్ జ్యోతి’ అనే పేరు పెట్టిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

Posted On: 14 SEP 2024 12:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నివాసంలో జన్మించిన ఒక దూడకు దీప్ జ్యోతి అనే పేరు పెట్టారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో కొన్ని ఛాయాచిత్రాలతో పాటు ఒక వీడియోను కూడా పొందుపరుస్తూ ఇలా తన ఆనందాన్ని పంచుకున్నారు:

‘‘మన శాస్త్రాలలో ‘గావ: సర్వసుఖ ప్రదా:’ అన్నారు’’

లోక్  కల్యాణ్ మార్గ్ లోని ప్రధాని ఇంటి పరివారంలోకి ఓ కొత్త సభ్యుని శుభ ప్రవేశం సంగతి ఇది.

ప్రధాన మంత్రి ఆవాసంలో ప్రియమైన గో మాత ఓ బిడ్డకు జన్మనిచ్చింది, ఆ లేగదూడ తల మీద జ్యోతి గుర్తు కనిపిస్తోంది.

అందుకని, నేను దీనికి ‘దీపజ్యోతి’ అని పేరు పెట్టాను.’’

 

‘‘నంబరు 7, లోక్ కల్యాణ్ మార్గ్ లోకి ఒక కొత్త సభ్యుడు వచ్చాడు!

దీప్ జ్యోతి నిజంగా ఎంతో ప్రేమాస్పదం సుమా.’’

 

 

 

***

MJPS/TS



(Release ID: 2055115) Visitor Counter : 6