ప్రధాన మంత్రి కార్యాలయం
హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
06 SEP 2024 5:22PM by PIB Hyderabad
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రవీణ్ కుమార్ కనబరచిన సంకల్పాన్ని, గట్టి పట్టుదలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పోస్టులో ఇలా పేర్కొన్నారు:
‘‘పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల హై జంప్ టి64 పోటీలో స్వర్ణ పతకాన్ని గెలిచి కొత్త శిఖరాలను చేరుకొన్నందుకు ప్రవీణ్ కుమార్ కు ఇవే అభినందనలు.
ఆయన కనబరచిన దృఢ సంకల్పం, పట్టు వదలని గుణం మన దేశానికి కీర్తిని సంపాదించి పెట్టాయి.
ఆయనను చూసి భారతదేశం గర్వపడుతోంది.
జయ్ జయ్ భారత్ (#Cheer4Bharat)"
***
MJPS/RT
(రిలీజ్ ఐడి: 2054451)
సందర్శకుల సూచీ సంఖ్య : : 62
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam