ప్రధాన మంత్రి కార్యాలయం
పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ పోటీ లో బంగారు పతకాన్ని గెలిచిన పారా ఆర్చర్ శ్రీ హర్ విందర్ సింగ్ కు ప్రధాన మంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
04 SEP 2024 11:50PM by PIB Hyderabad
పారిస్ పారాలింపిక్స్ 2024 లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలుచుకున్న దివ్యాంగ విలువిద్య క్రీడాకారుడు హర్వీందర్ సింగ్ చేజిక్కించుకున్నందుకు ఆయనను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
హర్వీందర్ సింగ్ కనబరచిన ఖచ్చితత్వం, ఏకాగ్రత, చెక్కుచెదరని ఉత్సాహాలను గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించి ఆయన ఆటతీరు అసాధారణమైందంటూ మెచ్చుకొన్నారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘దివ్యాంగజనుల విలువిద్య క్రీడా విభాగంలో చాలా విశిష్టమైన స్వర్ణం ఇది’’
పారాలింపిక్స్ 2024 (#Paralympics2024) లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ పోటీ లో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు హర్వీందర్ సింగ్ కు అభినందనలు.
ఆయన ప్రదర్శించిన ఖచ్చితత్వం, ఏకాగ్రతలతో పాటు చెక్కుచెదరని ఉత్సాహం కూడా ప్రశంసనీయమైనవిగా ఉన్నాయి. ఆయన కార్యసాధనను చూసి భారతదేశం మురిసిపోతున్నది.
జయ్ జయ్ భారత్ (#Cheer4Bharat)”
***
MJPS/ST
(रिलीज़ आईडी: 2054111)
आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam