ప్రధాన మంత్రి కార్యాలయం

మెన్స్ క్లబ్ త్రోలో స్వర్ణం సాధించిన ధరంబీర్ కు ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 05 SEP 2024 7:59AM by PIB Hyderabad

పారిస్ పారాలింపిక్ క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు ధరంబీర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం.

‘ఎక్స్’లో శ్రీ మోదీ చేసిన  పోస్టు:

‘‘పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో దేశానికి పారాలింపిక్ క్రీడల్లో తొలి స్వర్ణాన్ని అందించి ధరంబీర్ చరిత్ర సృష్టించారు. తిరుగులేని స్ఫూర్తితో ఈ అపురూపమైన విజయం సాధించారు. ఈ గెలుపుతో దేశం సంతోషంలో మునిగిపోయింది. #Cheer4Bharat’’



(Release ID: 2052091) Visitor Counter : 23