ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఉక్రెయిన్ కు భిష్మ్ క్యూబులను బహూకరించిన ప్రధానమంత్రి

Posted On: 23 AUG 2024 6:33PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్  ప్రభుత్వానికి నాలుగు భిష్మ్  (సహయోగ్ హిత, మైత్రికి భారత ఆరోగ్య కార్యక్రమం) క్యూబులను బహూకరించారు. ఈ మానవతాపూర్వకమైన సహాయం అందించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్  జెలెన్ స్కీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించేందుకు తద్వారా విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ క్యూబులు ఉపయోగపడతాయి.  

అన్ని రకాల గాయాలు, వైద్య అవసరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలు ఒక్కో భిష్మ్  క్యూబు లో ఉంటాయి. బేసిక్ ఆపరేషన్  గదిలో సర్జికల్  పరికరాలుంటాయి. రోజుకి 10-15 ప్రాథమిక సర్జరీలు చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గాయాలు, రక్తస్రావం, కాలిన గాయాలు, ఫ్రాక్చర్లు వంటి విభిన్న స్వభావంతో కూడిన 200 కేసులను హ్యాండిల్  చేయగల సామర్థ్యం ఈ క్యూబునకు ఉంటుంది. ఇవి పరిమిత పరిమాణంలో విద్యుత్, ఆక్సిజెన్ కూడా స్వయంగా ఉత్పత్తి చేసుకోగలుగుతాయి. ఈ క్యూబుల నిర్వహణలో ఉక్రెయిన్ సిబ్బందికి ప్రాథమిక శిక్షణ ఇచ్చేందుకు భారతదేశం తన నిపుణుల బృందాన్ని పంపింది.



(Release ID: 2048537) Visitor Counter : 112