ప్రధాన మంత్రి కార్యాలయం

నేపాల్ లోని తనహున్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం

Posted On: 23 AUG 2024 10:22PM by PIB Hyderabad

నేపాల్  లోని తనహున్  జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. బాధితులకు భారత రాయబార కార్యాలయం అవసరమైన సహాయం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

శ్రీ మోదీ ‘‘ఎక్స్’’  వేదికగా ఇలా స్పందించారు.

‘‘నేపాల్  లోని తనహున్  జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం విచారం కలిగించింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. ఆ ప్రమాదంలో గాయపడిన వారు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. భారత రాయబార కార్యాలయం బాధితులందరికీ అవసరమైన సహాయం అందిస్తోంది’’ అన్నారు.  



(Release ID: 2048533) Visitor Counter : 12