ప్రధాన మంత్రి కార్యాలయం

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

Posted On: 16 AUG 2024 10:10AM by PIB Hyderabad

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బీహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా నేడు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళుల‌ర్పించారు. 

ఈ మేర‌కు ‘ఎక్స్‌’ మాథ్యమంలో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ పోస్టు చేశారు. 

అట‌ల్‌జీ పుణ్యతిథి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు.

‘‘దేశ‌నిర్మాణానికి అటల్ జీ చేసిన అస‌మాన సేవ‌ల‌కుగానూ అశేష జనవాహిని దృష్టిలో ఆయన చిరస్మరణీయులు. ప్రజల బాగోగుల కోసం ఆయ‌న త‌న జీవితం మొత్తాన్నీ అంకితం చేశారు. భార‌తదేశం కోసం ఆయ‌న కన్న కలల్ని సాకారం చేసేందుకు మేము నిరంత‌రం కృషి చేస్తూనే ఉంటాం.’’


ఈ రోజు ఉద‌యం ‘స‌దైవ్ అట‌ల్’ వ‌ద్ద ఇత‌ర ప్ర‌ముఖుల‌తో క‌లిసి ఆయ‌న‌ వాజ్ పేయికి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.”
 
 


(Release ID: 2045941) Visitor Counter : 25