ప్రధాన మంత్రి కార్యాలయం

కాంస్య పతకాన్ని సాధించినందుకు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లకు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 30 JUL 2024 1:38PM by PIB Hyderabad

‘పారిస్ ఒలింపిక్స్ 2024’లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ పోటీ లో కాంస్య పతకాన్ని సాధించిన భారతీయ షూటర్ లు మను భాకర్, సరబ్ జోత్ సింగ్ లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘మన షూటర్లను చూసుకొని మనం గర్వపడేటట్టు చేస్తూ, వారు నిరంతరంగా రాణిస్తూ వస్తున్నారు.

 

#Olympics  లో పది మీటర్ ల ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్  టీమ్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు @realmanubhaker, సరబ్ జోత్ సింగ్  లకు అభినందనలు.  వారు ఇద్దరూ గొప్ప నైపుణ్యాన్ని, సంఘటిత కృషిని చాటారు.  భారతదేశం పట్టరానంత సంతోషంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతోంది. 

 

మను కు ఇది ఆమె వరుసగా సాధించిన రెండో ఒలింపిక్ పతకం;  ఈ పతకం ఆమె శ్రేష్ఠత్వాన్ని, అంకిత భావాన్ని రుజువుచేస్తోంది. #Cheer4Bharat’’

 

 

 

 

 

***

DS/ST



(Release ID: 2039316) Visitor Counter : 23