ప్రధాన మంత్రి కార్యాలయం

#10YearsOfMyGov: ఈ మాధ్యమం సుపరిపాలన కు ఒక చైతన్య భరిత వేదిక గా ఉందంటూ ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2024 6:50PM by PIB Hyderabad

MyGov (మైగవ్) మాధ్యమం ప్రాతినిధ్యపూర్వకమై, సుపరిపాలన కు చైతన్యభరిత వేదిక గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మైగవ్ మాధ్యమం పది సంవత్సరాల కాలాన్ని ఈ రోజు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఆ మాధ్యమాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.

 

ఈ MyGov (మైగవ్) కు తమ బహుమూల్య అంతర్ దృష్టితో సూచనలు-సలహాల ను అందించి మెరుగులు దిద్దిన వారిని అందరిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు, మనం #10YearsOfMyGov ను గుర్తుకు తెచ్చుకొంటున్నాం. ఈ మాధ్యమాన్ని తమ అమూల్యమైన అంతర్ దృష్టితోను, సూచనలు-సలహాలతోను సుసంపన్నం చేసిన వారినందరిని నేను అభినందిస్తున్నాను. గత దశాబ్ద కాలంలో, మైగవ్ ప్రాతినిధ్యపూర్వకమైన, సుపరిపాలన కు ఒక చైతన్యభరితమైన వేదిక గా ఎదిగింది.’’

 

***

 

DS/RT



(Release ID: 2038116) Visitor Counter : 41