రాష్ట్రప‌తి స‌చివాల‌యం

గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పార్లమెంటులో చేసిన ప్రసంగం పాఠం

Posted On: 27 JUN 2024 12:13PM by PIB Hyderabad

గౌరవనీయ సభ్యులారా,

1.18వ లోక్ సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు.

దేశ ఓటర్ల నమ్మకాన్ని చూరగొన్న తర్వాత మీరంతా ఇక్కడ ఉన్నారు.

దేశానికిప్రజలకు సేవ చేసే భాగ్యం చాలా తక్కువ మందికి దక్కుతుంది.

నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో మీరు మీ బాధ్యతలను నెరవేరుస్తారని, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక మాధ్యమంగా ఉంటారని నేను విశ్వసిస్తున్నాను.

లోక్ సభ స్పీకర్ గా తన మహోన్నతమైన పాత్రను నిర్వర్తించినందుకు శ్రీ ఓం బిర్లా గారికి శుభాకాంక్షలు.

ప్రజాజీవితంలో ఆయనకు అపార అనుభవం ఉంది.

తన నైపుణ్యాలతో ప్రజాస్వామ్య సంప్రదాయాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది.

గౌరవనీయ సభ్యులారా,

2. ఈ రోజు కోట్లాది మంది భారతీయుల తరఫున భారత ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు ఇవి.

సుమారు 64 కోట్ల మంది ఓటర్లు ఉల్లాసంగాఉత్సాహంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు.

ఈసారి కూడా మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారుజమ్ముకశ్మీర్ నుంచి ఈ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం వెలుగుచూసింది.

కశ్మీర్ లోయ అనేక దశాబ్దాల ఓటింగ్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది.

గత నాలుగు దశాబ్దాలుగా కశ్మీర్ లో బంద్ లుసమ్మెల మధ్య పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.

భారత్ శత్రువులు ప్రపంచ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారుఇది జమ్ముకశ్మీర్ అభిప్రాయంగా చూపారు.

కానీ ఈసారి దేశం లోపలబయట ఇలాంటి ప్రతి అంశానికి కశ్మీర్ లోయ ధీటైన సమాధానం ఇచ్చింది.

తొలిసారిగా ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇంటి నుంచే ఓటు వేసే ( హోమ్ ఓటింగ్) సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

లోక్‌సభ ఎన్నికలలో పాల్గొన్న ఉద్యోగులందరూ చేసిన పనికి నా అభినందనలు తెలియజేస్తున్నాను, వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

గౌరవనీయ సభ్యులారా,

3. ప్రపంచం మొత్తం 2024 లోక్సభ ఎన్నికల గురించే మాట్లాడుకుంటోంది.

భారత ప్రజలు స్పష్టమైన మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని వరుసగా మూడోసారి ఎన్నుకున్నారని ప్రపంచం చూస్తోంది.

ఇది ఆరు దశాబ్దాల తర్వాత జరిగింది.

భారత ప్రజల ఆకాంక్షలు ఎన్నడూ లేనంతగా ఉన్న సమయంలోప్రజలు వరుసగా మూడవసారి నా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు.

మా ప్రభుత్వం మాత్రమే వారి ఆకాంక్షలను నెరవేర్చగలదని భారత ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది.

అందువల్ల, 2024 యొక్క ఈ ఎన్నికలు విధానంఉద్దేశ్యంఅంకితభావం మరియు నిర్ణయాలపై విశ్వాసానికి ఎన్నికలు:

·         బలమైన మరియు నిర్ణయాత్మక ప్రభుత్వంపై నమ్మకం

·         సుపరిపాలనసుస్థిరతకొనసాగింపుపై నమ్మకం

·         నిజాయితీకృషిపై నమ్మకం

·         భద్రత మరియు శ్రేయస్సుపై నమ్మకం

·         ప్రభుత్వ హామీలుపంపిణీపై నమ్మకం

·         వికసిత్ భారత్ కావాలనే భారత్ సంకల్పంపై నమ్మకం

గత 10 సంవత్సరాలలో మా ప్రభుత్వం చేపట్టిన సేవా మరియు సుపరిపాలన మిషన్ కు ఇది ఆమోద ముద్ర.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే పని నిరాటంకంగా కొనసాగాలనిభారతదేశం తన లక్ష్యాలను సాధించాలని ఇది ఆదేశం.

గౌరవనీయ సభ్యులారా,

4. 18వ లోక్సభ అనేక విధాలుగా చారిత్రాత్మకం.

అమృత్ కాల తొలినాళ్లలో ఈ లోక్ సభ ఏర్పాటైంది.

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ లోక్ సభ సాక్షిగా నిలవనుంది.

ప్రజాసంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాల్లో ఈ లోక్ సభ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

వచ్చే సమావేశాల్లో మా ప్రభుత్వం తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.

ప్రభుత్వ దీర్ఘకాలిక విధానాలుభవిష్యత్ దార్శనికతకు ఈ బడ్జెట్ సమర్థవంతమైన డాక్యుమెంట్ అవుతుంది.

 

ప్రధాన ఆర్థికసామాజిక నిర్ణయాలతో పాటు అనేక చారిత్రాత్మక అడుగులు కూడా ఈ బడ్జెట్ లో కనిపిస్తాయి.

వేగవంతమైన అభివృద్ధి కోసం భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంస్కరణల వేగాన్ని మరింత వేగవంతం చేయనున్నారు.

ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని మా ప్రభుత్వం విశ్వసిస్తుంది.

ఇది పోటీ సహకార సమాఖ్య యొక్క నిజమైన స్ఫూర్తి.

రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి అనే నమ్మకంతో ముందుకు సాగుతాం.

గౌరవనీయ సభ్యులారా,

5. సంస్కరణపనితీరుపరివర్తన సంకల్పం భారతదేశాన్ని నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చింది.

పదేళ్లలో 11వ స్థానంలో ఉన్న భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది.

2021 నుంచి 2024 వరకు భారత్ సగటున ఏటా శాతం వృద్ధిని సాధించింది.

సాధారణ పరిస్థితుల్లో ఈ వృద్ధి సాధించలేదు.

ఇటీవలి సంవత్సరాలలోమేము 100 సంవత్సరాలలో అతిపెద్ద మహమ్మారిని చూశాము.

ప్రపంచ మహమ్మారి మధ్యప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణల మధ్య భారతదేశం ఈ వృద్ధిని సాధించింది.

గత పదేళ్లలో జాతీయ ప్రయోజనాల కోసం చేపట్టిన సంస్కరణలుకీలక నిర్ణయాల వల్ల ఇది సాధ్యమైంది.

ప్రస్తుతం ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంది.

ఇప్పుడుభారతదేశాన్ని ప్రపంచంలో 3 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

 ఈ లక్ష్యాన్ని సాధించడం అభివృద్ధి చెందిన భారతదేశ పునాదిని బలోపేతం చేస్తుంది.

గౌరవనీయ సభ్యులారా,

6. మా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని మూడు స్తంభాలైన తయారీసేవలువ్యవసాయానికి సమాన ప్రాధాన్యం ఇస్తోంది.

పీఎల్ఐ పథకాలుసులభతర వ్యాపారం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) తో  పెద్ద ఎత్తున పెట్టుబడులుఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడ్డాయి.

సంప్రదాయ రంగాలతో పాటు సన్ రైజ్ సెక్టార్లను కూడా మిషన్ మోడ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

సెమీకండక్టర్ అయినాసోలార్ అయినా.

ఎలక్ట్రిక్ వాహనాలు అయినాఎలక్ట్రానిక్ వస్తువులు అయినా..

అది గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు లేదా బ్యాటరీలు కావచ్చు,

అది విమాన వాహక నౌకలు కావచ్చు లేదా యుద్ధ విమానాలు కావచ్చు,

ఈ రంగాలన్నింటిలో భారత్ విస్తరిస్తోంది.

లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది.

సేవల రంగాన్ని కూడా ప్రభుత్వం బలోపేతం చేస్తోంది.

నేడు ఐటి నుండి టూరిజం వరకు మరియు ఆరోగ్యం నుండి శ్రేయస్సు వరకు ప్రతి రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదుగుతోంది.

ఇది ఉపాధిస్వయం ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.

గౌరవనీయ సభ్యులారా,

7. గత పదేళ్లలో మా ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతి అంశానికి పెద్దపీట వేసింది.

గ్రామాల్లో వ్యవసాయాధారిత పరిశ్రమలుపాడి పరిశ్రమమత్స్య ఆధారిత పరిశ్రమలను విస్తరిస్తున్నారు.

ఇందులోనూ సహకార సంఘాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ పీఓ), పీఏసీఎస్ వంటి సహకార సంస్థల భారీ నెట్ వర్క్ ను ప్రభుత్వం సృష్టిస్తోంది.

చిన్న రైతుల ప్రధాన సమస్య నిల్వకు సంబంధించినది.

అందువల్ల సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వ సామర్థ్యాన్ని సృష్టించే పథకానికి మా ప్రభుత్వం పని ప్రారంభించింది.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు రూ.3,20,000 కోట్లకు పైగా పంపిణీ చేశారు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రూ.20 వేల కోట్లకు పైగా రైతులకు బదిలీ చేసింది.

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెంచింది.

గౌరవనీయ సభ్యులారా,

8. నేటి భారతదేశం తన ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ వ్యవస్థలో మార్పులు చేస్తోంది.

ఎగుమతులను పెంచడం ద్వారా మరింత స్వావలంబన సాధించి రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఆలోచనతో విధానాలు రూపొందించి నిర్ణయాలు తీసుకున్నారు.

ఉదాహరణకు పప్పుధాన్యాలునూనెగింజల కోసం ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది.

ప్రపంచ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న ఆహార ఉత్పత్తులను దృష్టిలో ఉంచుకుని కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నారు.

ఈ రోజుల్లోప్రపంచంలో సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

భారతీయ రైతులకు ఈ డిమాండ్ ని  తీర్చే సామర్థ్యం పుష్కలంగా ఉంది.

అందువల్లప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని మరియు దాని సంబంధిత ఉత్పత్తుల సరఫరా గొలుసును బలోపేతం చేస్తోంది.

ఈ ప్రయత్నాలతో రైతులు వ్యవసాయ పనులపై చేసే ఖర్చు తగ్గడంతో పాటు వారి ఆదాయం కూడా మరింత పెరుగుతుంది.

గౌరవనీయ సభ్యులారా,

9. నేటి భారతదేశం ప్రపంచ సవాళ్లను పెంచడానికి కాదుప్రపంచానికి పరిష్కారాలను అందించడానికి ప్రసిద్ధి చెందింది.

విశ్వబంధుగా భారత్ అనేక ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను అందించడంలో చొరవ తీసుకుంది.  

వాతావరణ మార్పుల నుంచి ఆహార భద్రతపౌష్టికాహారం నుంచి సుస్థిర వ్యవసాయం వరకు వివిధ సమస్యలకు పరిష్కారాలను అందిస్తున్నాం.

మా ముతక ధాన్యాలు శ్రీ అన్నను ఒక సూపర్ ఫుడ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మేము ఒక ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాము.

భారత్ చొరవతో 2023 సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకున్నారు.

ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ కార్యక్రమంగా జరుపుకోవడం మీరు చూశారు

భారతదేశపు ఈ గొప్ప వారసత్వం యొక్క ప్రతిష్ఠ ప్రపంచంలో నిరంతరం పెరుగుతోంది.

యోగాఆయుష్ ను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో భారత్ సాయపడుతోంది.

మా ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను అనేక రెట్లు పెంచింది.

వాతావరణ సంబంధిత లక్ష్యాలను నిర్ణీత సమయం కంటే ముందుగానే సాధిస్తున్నాం.

నెట్ జీరో దిశగా మేం చేపట్టిన కార్యక్రమాలు అనేక దేశాలకు స్ఫూర్తిదాయకం.

అంతర్జాతీయ సౌర కూటమి వంటి మా కార్యక్రమాల్లో రికార్డు స్థాయిలో దేశాలు మాతో భాగస్వామ్యం అయ్యాయి.

గౌరవనీయ సభ్యులారా,

10. భవిష్యత్తు హరిత యుగం కాబోతోంది.

ఈ దిశగా మా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

గ్రీన్ ఇండస్ట్రీస్(హరిత పరిశ్రమలలో) లో పెట్టుబడులను పెంచుతున్నామనితద్వారా హరిత ఉద్యోగాలను పెంచుతున్నాము

గ్రీన్ ఎనర్జీ అయినాగ్రీన్ మొబిలిటీ అయినా అన్ని రంగాల్లోనూ ప్రతిష్టాత్మక లక్ష్యాలతో పనిచేస్తున్నాం.

మన నగరాలను ప్రపంచంలోనే అత్యుత్తమ నివాస ప్రాంతాలుగా మార్చడానికి కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

కాలుష్య రహితపరిశుభ్రమైనసౌకర్యాలతో కూడిన నగరాల్లో నివసించడం భారతీయ పౌరుల హక్కు.

ముఖ్యంగా చిన్న నగరాలుపట్టణాల్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి.

ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్ భారత్.

2014 ఏప్రిల్ లో భారత్ లో 209 విమాన మార్గాలు మాత్రమే ఉన్నాయి.

2024 ఏప్రిల్ నాటికి ఈ సంఖ్య 605కు పెరిగింది.

విమానయాన మార్గాల పెరుగుదల టైర్ -2 మరియు టైర్ -3 నగరాలకు నేరుగా ప్రయోజనం చేకూర్చింది.

పదేళ్లలో మెట్రో 21 నగరాలకు చేరుకుంది

వందే మెట్రో వంటి అనేక పథకాల్లో పనులు జరుగుతున్నాయి.

భారతదేశ ప్రజారవాణా వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

గౌరవనీయ సభ్యులారా,

11. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారతదేశం నిలబడటానికి దోహదపడే ఆధునిక ప్రమాణాలపై మా ప్రభుత్వం పనిచేస్తోంది.

ఈ దిశలోమౌలిక సదుపాయాల అభివృద్ధి మారుతున్న భారతదేశానికి కొత్త ముఖంగా ఆవిర్భవించింది.

మా ప్రభుత్వం 10 సంవత్సరాలలో ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద 3,80,000 కిలోమీటర్లకు పైగా గ్రామ రహదారులను నిర్మించింది.

ప్రస్తుతం దేశంలో జాతీయ రహదారులుఎక్స్ ప్రెస్ వేల నెట్ వర్క్ విస్తరిస్తోంది.

జాతీయ రహదారుల నిర్మాణంలో వేగం రెట్టింపు అయింది.

అహ్మదాబాద్ముంబై మధ్య హైస్పీడ్ రైల్ ఎకోసిస్టమ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

దేశంలోని ఉత్తరదక్షిణతూర్పు ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిసారిగా ఇంత పెద్ద ఎత్తున అంతర్గత జలమార్గాల పనులు ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమం వల్ల ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.

మా ప్రభుత్వం గత పదేళ్లలో ఈశాన్య ప్రాంత అభివృద్ధికి కేటాయింపులను నాలుగు రెట్లు పెంచింది.

యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మక ముఖద్వారంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని రకాల కనెక్టివిటీని విస్తరిస్తున్నారు.  విద్యవైద్యంపర్యాటకంఉపాధి సహా అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు.

అసోంలో రూ.27 వేల కోట్లతో సెమీ కండక్టర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాలు కూడా ఆత్మ నిర్భర భారత్ (మేడిన్ ఇండియా)కు కేంద్రంగా మారనున్నాయి.

 

ఈశాన్య రాష్ట్రాల్లో శాశ్వత శాంతి కోసం మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది.

 

గత పదేళ్లలో ఎన్నో పాత వివాదాలు పరిష్కారమైపలు కీలక ఒప్పందాలు కుదిరాయి.

ఈశాన్య రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఏఎఫ్ ఎస్ పీఏను ఉపసంహరించుకునే పని కూడా దశలవారీగా ఆ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.

దేశంలో అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంలో ఈ కొత్త కార్యక్రమాలు భారతదేశ భవిష్యత్తును సూచిస్తున్నాయి

గౌరవనీయ సభ్యులారా,

12. మహిళా ఆధారిత అభివృద్ధికి కట్టుబడి ఉన్న మా ప్రభుత్వం మహిళా సాధికారతలో కొత్త శకానికి నాంది పలికింది.

లోక్ సభవిధానసభల్లో మహిళలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు

నేడు నారీ శక్తి వందన్ అధినియం అమలుతో వారు సాధికారత సాధించారు.

గత దశాబ్ద కాలంలోవివిధ ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థిక సాధికారతకు దారితీశాయి

గత పదేళ్లలో కోట్ల పీఎం ఆవాస్ ఇళ్లను మహిళా లబ్ధిదారులకు కేటాయించిన విషయం తెలిసిందే

ఇప్పుడు మా ప్రభుత్వం మూడో టర్మ్ ప్రారంభంలోనే కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది

ఈ ఇళ్లను ఎక్కువగా మహిళా లబ్ధిదారులకు కేటాయించనున్నారు

గత పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలను స్వయం సహాయక సంఘాలుగా తీర్చిదిద్దారు.

కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చేందుకు మా ప్రభుత్వం సమగ్ర ప్రచారాన్ని ప్రారంభించింది

ఇందుకోసం స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయాన్ని కూడా పెంచుతున్నారు.

నైపుణ్యాలనుఆదాయ వనరులను మెరుగుపర్చడంమహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించడం ప్రభుత్వ ప్రయత్నం

ఈ లక్ష్య సాధనకు నమో డ్రోన్ దీదీ పథకం దోహదం చేస్తోంది

ఈ పథకం కింద వేలాది స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు డ్రోన్లను అందించడంతో పాటు డ్రోన్ పైలట్లుగా శిక్షణ ఇస్తున్నారు

మా ప్రభుత్వం ఇటీవల కృషి సఖి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది

ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలకు చెందిన 30 వేల మంది మహిళలకు కృషి సఖి సర్టిఫికెట్లు అందించారు

వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించడంలో రైతులకు సహాయపడేలా కృషి సఖీలకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు

గౌరవనీయ సభ్యులారా,

13. మహిళల పొదుపును గరిష్టంగా పెంచడమే మా ప్రభుత్వ ప్రయత్నం.

బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్లపై ఆడపిల్లలకు ఎక్కువ వడ్డీ ఇచ్చే సుకన్య సమృద్ధి యోజనకు ఎంత ఆదరణ ఉందో మనకు తెలుసు.

ఉచిత రేషన్చౌక గ్యాస్ సిలిండర్లు అందించే పథకాలతో మహిళలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతున్నారు.

ఇప్పుడు మా ప్రభుత్వం కూడా విద్యుత్ బిల్లును సున్నాకు తగ్గించివిద్యుత్ అమ్మడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే పథకాన్ని తీసుకువచ్చింది.

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇందుకోసం మా ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.78 వేల వరకు సాయం అందిస్తోంది.

అతి తక్కువ సమయంలోనే కోటికి పైగా కుటుంబాలు ఈ పథకం కింద నమోదు చేసుకున్నాయి.

సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసిన ఇళ్లలో ఇప్పుడు కరెంటు బిల్లు సున్నా అయింది.

.

గౌరవనీయ సభ్యులారా,

14. దేశంలోని పేదలుయువతమహిళలురైతులు సాధికారత సాధించినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

అందుకే మా ప్రభుత్వ పథకాల్లో ఈ నాలుగు స్తంభాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

ప్రతి ప్రభుత్వ పధకం యొక్క ప్రయోజనం వారికి చేరేలా చూడటమే మా ప్రయత్నంఇది సంతృప్త విధానం.

ప్రభుత్వ పథకాలకు ఒక్కరు కూడా దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తే అందరికీ మేలు జరుగుతుంది.

గడచిన పదేళ్లలో ప్రభుత్వ పథకాలను శాచురేషన్ విధానంతో అమలు చేయడం వల్లనే 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడ్డారు.

ఇందులో షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగలువెనుకబడిన తరగతులు మరియు అన్ని ఇతర సామాజిక మరియు ప్రాంతీయ సమూహాల కుటుంబాలు ఉన్నాయి.

గత 10 సంవత్సరాలలోలాస్ట్ మైల్ డెలివరీపై దృష్టి పెట్టడం ఈ వర్గాల జీవితాలను మార్చింది.

ముఖ్యంగా గిరిజన వర్గాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

24 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పీఎం-జన్మన్ వంటి పథకం నేడు అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాల అభ్యున్నతికి మాధ్యమంగా మారుతోంది.

అణగారిన వర్గాలకు జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా సులభమైన రుణాలను కూడా అందిస్తోంది.

దివ్యాంగ సోదర సోదరీమణుల కోసం మా ప్రభుత్వం చౌకైన స్వదేశీ సహాయక పరికరాలను అభివృద్ధి చేస్తోంది.

పీఎం దివ్యాశ కేంద్రాలను దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.

నిరుపేదలకు సేవ చేయాలనే సంకల్పమే నిజమైన సామాజిక న్యాయం.

 గౌరవనీయ సభ్యులారా,

15. దేశ శ్రామిక శక్తిని గౌరవిస్తూకార్మికుల సంక్షేమంసాధికారత మా ప్రభుత్వ ప్రాధాన్యత.

మా ప్రభుత్వం కార్మికుల కోసం అన్ని సామాజిక భద్రతా పథకాలను ఏకీకృతం చేస్తోంది.

డిజిటల్ ఇండియా మరియు పోస్టాఫీసుల నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా ప్రమాద మరియు జీవిత బీమా కవరేజీని పెంచడానికి పని జరుగుతోంది.

పిఎం స్వనిధి పరిధిని విస్తరించడంతో పాటు గ్రామీణసెమీ అర్బన్ ప్రాంతాల్లోని వీధి వ్యాపారులను కూడా దీని పరిధిలోకి తీసుకురానున్నారు.

గౌరవనీయ సభ్యులారా,

16. బాబా సాహెబ్ డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ ఏ సమాజ పురోగతి అయినా సమాజంలోని అట్టడుగు వర్గాల పురోగతిపై ఆధారపడి ఉంటుందని విశ్వసించారు.

గత పదేళ్లలో దేశం సాధించిన విజయాలుపురోగతికి పేదల సాధికారతే పునాది.

ప్రభుత్వం తమ సేవలో ఉందని మా ప్రభుత్వం తొలిసారిగా పేదలకు తెలిసేలా చేసింది.

కరోనా మహమ్మారి కష్టకాలంలో, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడానికి ప్రభుత్వం పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది.

పేదరికం నుంచి బయటపడిన కుటుంబాలు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు ఈ పథకం ప్రయోజనాన్ని అందిస్తున్నారు.

స్వచ్ఛభారత్ మిషన్ పేదల గౌరవాన్నివారి ఆరోగ్యాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశంగా మార్చింది.

దేశంలో తొలిసారిగా కోట్లాది మంది పేదలకు మరుగుదొడ్లు నిర్మించారు.

జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను నేడు దేశం నిజమైన స్ఫూర్తితో అనుసరిస్తోందన్న నమ్మకాన్ని ఈ ప్రయత్నాలు కల్పిస్తున్నాయి.

మా ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన కింద 55 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత వైద్య సేవలు అందిస్తోంది.

దేశంలో 25,000 జన ఔషధి కేంద్రాల ప్రారంభం కూడా శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోబోతోంది.

ఇప్పుడు 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఉచిత చికిత్స అందుతుంది.

గౌరవనీయ సభ్యులారా,

17. తరచూ విరోధ మనస్తత్వంసంకుచిత స్వార్థం కారణంగా ప్రజాస్వామ్య మౌలిక స్ఫూర్తి బాగా దెబ్బతింటుంది.

ఇది పార్లమెంటరీ వ్యవస్థతో పాటు దేశ అభివృద్ధి ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుంది.

దేశంలో కొన్ని దశాబ్దాలపాటు కొనసాగిన అస్థిర ప్రభుత్వాల కాలంలోఅనేక ప్రభుత్వాలుఇష్టమున్నాసంస్కరణలు తీసుకురాలేకపోయాయి లేదా కీలక నిర్ణయాలు తీసుకోలేకపోయాయి.

భారత ప్రజలు తమ నిర్ణయాత్మక తీర్పుతో ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చారు.

గత పదేళ్లలో ఇలాంటి అనేక సంస్కరణలు జరిగాయిఅవి నేడు దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయి.

ఈ సంస్కరణలు చేపట్టినప్పుడు కూడా వాటిని వ్యతిరేకించి ప్రతికూలతను వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు.

కానీ ఈ సంస్కరణలన్నీ కాలపరీక్షలో నిలిచాయి.

 

పదేళ్ల క్రితం భారత బ్యాంకింగ్ రంగం కుదేలవ్వకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ సంస్కరణలు తీసుకువచ్చి ఐబీసీ వంటి చట్టాలు చేసింది.

నేడుఈ సంస్కరణలు భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని ప్రపంచంలోనే బలమైన బ్యాంకింగ్ రంగాలలో ఒకటిగా మార్చాయి.

మన ప్రభుత్వ రంగ బ్యాంకులు నేడు పటిష్టంగాలాభదాయకంగా ఉన్నాయిప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 2023-24లో రూ .1.4 లక్షల కోట్లు దాటాయిఇది గత సంవత్సరం కంటే 35% ఎక్కువమన బ్యాంకుల బలం వారి రుణ పునాదిని విస్తరించడానికి మరియు దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేయడానికి వీలు కల్పిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

నేడు ఎస్బీఐ రికార్డు లాభాలను ఆర్జిస్తోంది.

గతంలో కంటే నేడు ఎల్ఐసీ బలంగా ఉంది.

నేడు దేశ రక్షణ రంగానికి కూడా హెచ్ఏఎల్ బలం చేకూరుస్తోంది.

నేడుజిఎస్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి ఒక మాధ్యమంగా మారింది మరియు వ్యాపారం మరియు వాణిజ్యాన్ని మునుపటి కంటే సులభతరం చేయడానికి సహాయపడుతుంది.

ఏప్రిల్ నెలలో తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు దాటాయిదీంతో రాష్ట్రాలు ఆర్థికంగా కూడా బలోపేతమయ్యాయి.

నేడు ప్రపంచమంతా డిజిటల్ ఇండియాడిజిటల్ పేమెంట్స్ పట్ల ఆసక్తిగా ఉంది.

గౌరవనీయ సభ్యులారా,

18. బలమైన భారతదేశానికి మన సాయుధ దళాల ఆధునీకరణ చాలా అవసరం.

మన సాయుధ దళాలలో సంస్కరణలు నిరంతర ప్రక్రియగా ఉండాలితద్వారా యుద్ధాల సమయంలో మన దళాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలి.

దీని మార్గదర్శకత్వంలో మా ప్రభుత్వం గత పదేళ్లలో రక్షణ రంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టింది.

సీడీఎస్ వంటి సంస్కరణలు మన రక్షణ దళాలకు కొత్త బలాన్నిచ్చాయి.

రక్షణ రంగాన్ని స్వావలంబనగా మార్చేందుకు మా ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు చేపట్టింది.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సంస్కరణల వల్ల రక్షణ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరింది.

40కి పైగా ఆర్డినెన్స్ కర్మాగారాలను రక్షణ రంగ సంస్థలుగా పునర్నిర్మించారుఫలితంగా వాటి సామర్థ్యం మరియు దక్షత మెరుగుపడింది

ఇలాంటి సంస్కరణల కారణంగానే భారత్ ఇప్పుడు లక్ష కోట్లకు పైగా విలువైన రక్షణ పరికరాలను తయారు చేస్తోంది.  

గత దశాబ్ద కాలంలో మన రక్షణ ఎగుమతులు 18 రెట్లు పెరిగి రూ.21,000 కోట్ల స్థాయికి చేరుకున్నాయి

ఫిలిప్పీన్స్ తో బ్రహ్మోస్ క్షిపణి రక్షణ ఒప్పందం రక్షణ ఎగుమతి రంగంలో భారతదేశ ప్రతిష్ఠను బలోపేతం చేసింది.

యువతకువారి స్టార్టప్ లకు ప్రోత్సాహం అందించడం ద్వారా ప్రభుత్వం స్వయం సమృద్ధి రక్షణ రంగానికి బలమైన పునాది వేయగలిగింది

ఉత్తర్ ప్రదేశ్తమిళనాడులో రెండు డిఫెన్స్ కారిడార్లను కూడా మా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.  

గత ఏడాది రక్షణ దళాల మొత్తం కొనుగోళ్లలో దాదాపు 70 శాతం భారతీయ తయారీదారుల నుంచే సేకరించడం మనందరికీ సంతోషకరమైన విషయం

మన రక్షణ దళాలు 500 కంటే ఎక్కువ రక్షణ వస్తువులను దిగుమతి చేసుకోకూడదని నిర్ణయించాయి

ఈ ఆయుధాలురక్షణకు సంబంధించిన పరికరాలన్నీ భారత కంపెనీల నుంచే కొనుగోలు చేస్తున్నారు

సాయుధ దళాల్లోని సిబ్బంది అవసరాలకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుంది.

అందుకే దశాబ్దాల తర్వాత వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేస్తున్నాం.

దీని కింద ఇప్పటి వరకు రూ.1,20,000 కోట్లు పంపిణీ చేశారు.

మన అమరవీరుల గౌరవార్థం ప్రభుత్వం కర్తవ్య మార్గానికి ఒక చివర జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఈ ప్రయత్నాలు తన ధైర్యవంతులైన సైనికులకు కృతజ్ఞత కలిగిన దేశం నుండి నమస్కారాలు మాత్రమే కాదునేషన్ ఫస్ట్ యొక్క ఆదర్శానికి నిరంతర ప్రేరణకు మూలం.  

గౌరవనీయ సభ్యులారా,

19. ఈ దేశ యువత పెద్ద కలలు కనడానికిఆ కలలను సాకారం చేసుకోవడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించడంలో మా ప్రభుత్వం నిమగ్నమైంది

గత పదేళ్లలో మన యువతకు ఇబ్బంది కలిగించిన ప్రతి అవరోధాన్ని తొలగించాం

గతంలో సర్టిఫికెట్ల ధ్రువీకరణ పత్రాల కోసం యువత ఇంటింటికీ పరిగెత్తాల్సి వచ్చేది.  ఇప్పుడు వారి స్వీయ ధృవీకరణ సరిపోతుంది.   

కేంద్ర ప్రభుత్వ గ్రూప్-సిగ్రూప్-డి పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను రద్దు చేసింది.  

గతంలో భారతీయ భాషల్లో చదివిన విద్యార్థులకు అన్యాయమైన పరిస్థితి ఎదురైంది.  

నూతన జాతీయ విద్యావిధానం అమలుతో మా ప్రభుత్వం ఈ అన్యాయాన్ని తొలగించగలిగింది

ఇకపై విద్యార్థులు భారతీయ భాషల్లో ఇంజినీరింగ్ కోర్సులు చేయొచ్చు

గత పదేళ్లలో కొత్త ఐఐటీలు, 16 ఐఐఐటీలు, 7 ఐఐఎంలు, 15 కొత్త ఎయిమ్స్, 315 మెడికల్ కాలేజీలు, 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి

ఈ సంస్థలను మరింత బలోపేతం చేయడంఅవసరాన్ని బట్టి వాటి సంఖ్యను పెంచడం ప్రభుత్వ ప్రయత్నం

డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.

అటల్ టింకరింగ్ ల్యాబ్స్స్టార్టప్ ఇండియాస్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశంలోని యువత సామర్థ్యాన్ని పెంపొందించడానికి దోహదపడ్డాయి

ఈ ప్రయత్నాల కారణంగానే నేడు భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ గా అవతరించింది

గౌరవనీయ సభ్యులారా,

20. దేశంలోని యువతకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన అవకాశాలను కల్పించడం ప్రభుత్వ నిరంతర ప్రయత్నం

అది పోటీ పరీక్షలైనాప్రభుత్వ నియామకాలైనా ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు.  ఈ ప్రక్రియకు పూర్తి పారదర్శకతచిత్తశుద్ధి అవసరం

ఇటీవల కొన్ని పరీక్షల్లో పేపర్ లీకేజీ ఘటనలకు సంబంధించి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు మా  ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఇంతకు ముందు కూడా వివిధ రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ ఘటనలు అనేకం చూశాం

పార్టీ రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా పటిష్టమైన చర్యలు చేపట్టడం ముఖ్యం.

 

పరీక్షల్లో అన్యాయానికి వ్యతిరేకంగా పార్లమెంటు కఠినమైన చట్టాన్ని కూడా రూపొందించింది.

పరీక్షా సంబంధిత సంస్థలువాటి పనితీరుపరీక్షా ప్రక్రియలోని అన్ని అంశాల్లో ప్రధాన సంస్కరణలకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది.

గౌరవనీయ సభ్యులారా,

21. దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి మా ప్రభుత్వం 'మేరా యువ భారత్ (ఎంవై భారత్)' ప్రచారాన్ని ప్రారంభించింది.

ఇప్పటివరకు 1.5 కోట్ల మందికి పైగా యువత దీని కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ కార్యక్రమం నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుంది.

నేడు మన యువతకు క్రీడల్లో కూడా ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు లభిస్తున్నాయి.

మా ప్రభుత్వ సమర్థవంతమైన కృషి కారణంగాయువ భారతీయ క్రీడాకారులు ప్రపంచ వేదికలపై రికార్డు సంఖ్యలో పతకాలు సాధిస్తున్నారు.

మరికొద్ది రోజుల్లో పారిస్ ఒలింపిక్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

ఒలింపిక్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి అథ్లెట్ ను చూసి గర్వపడుతున్నాంవారికి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

ఈ విజయాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత ఒలింపిక్ సంఘం కూడా 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

గౌరవనీయ సభ్యులారా,

22. భారతీయ న్యాయ సంహిత జూలై ఒకటో తేదీ నుంచి దేశంలో అమల్లోకి రానుంది.

బ్రిటీష్ పాలనలో పౌరులను శిక్షించే మనస్తత్వం ఉండేది.

దురదృష్టవశాత్తూవలసరాజ్యాల యుగంలోని అదే శిక్షా విధానం స్వాతంత్ర్యం తరువాత అనేక దశాబ్దాల పాటు కొనసాగింది.

దీనిని మార్చాలనే ఆలోచన చాలా దశాబ్దాలుగా చాలా చర్చనీయాంశమైందికానీ మా ప్రభుత్వమే దానిని చేయడానికి ధైర్యాన్ని చూపించింది.

ఇప్పుడు శిక్ష కంటే న్యాయానికి ప్రాధాన్యత లభిస్తుందిఇది మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది.

ఈ కొత్త చట్టాలు న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

నేడుదేశం వివిధ అంశాలలో వలసవాద మనస్తత్వం నుండి విముక్తి పొందుతున్నప్పుడుఇది ఆ దిశలో ఒక పెద్ద అడుగు.

ఇది మన స్వాతంత్ర్య సమరయోధులకు నిజమైన నివాళి కూడా.

మా ప్రభుత్వం సీఏఏ కింద శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం ప్రారంభించింది.

విభజన వల్ల నష్టపోయిన అనేక కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది.

సీఏఏ కింద పౌరసత్వం పొందిన కుటుంబాలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.

గౌరవనీయ సభ్యులారా,

23. భవిష్యత్తును నిర్మించేటప్పుడుమా ప్రభుత్వం భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని మరియు వారసత్వాన్ని పునరుద్ధరిస్తోంది.

తాజాగా నలంద విశ్వవిద్యాలయం భవ్యమైన క్యాంపస్ రూపంలో దీనికి కొత్త అధ్యాయాన్ని జోడించారు.

నలంద కేవలం ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదుప్రపంచ విజ్ఞాన కేంద్రంగా భారతదేశ అద్భుతమైన గతానికి నిదర్శనం.

కొత్త నలంద విశ్వవిద్యాలయం భారతదేశాన్ని ప్రపంచ విజ్ఞాన కేంద్రం గామార్చడంలో సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను.

వేల సంవత్సరాల మన వారసత్వంతో భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలన్నది మా ప్రభుత్వ ప్రయత్నం.

అందుకే దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాలువిశ్వాసఆధ్యాత్మిక కేంద్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.

గౌరవనీయ సభ్యులారా,

24. మా ప్రభుత్వం అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తుందో వారసత్వం పట్ల కూడా అంతే గర్వంతో పనిచేస్తోంది.

వారసత్వం పట్ల గర్వించే ఈ సంకల్పం షెడ్యూల్డ్ కులాలుషెడ్యూల్డ్ తెగలుఅణగారిన మరియు అన్ని వర్గాలకు గౌరవ చిహ్నంగా మారుతోంది.

భగవాన్ బిర్సా ముండా జయంతిని జన్ జాతియా గౌరవ్ దివస్ గా జరుపుకోవడం మా ప్రభుత్వం ప్రారంభించింది.

భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు.

రాణి దుర్గావతి 500వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా నిర్వహిస్తోంది.

రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకుని గత నెలలో దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభమయ్యాయి.

గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్గురు గోవింద్ సింగ్ జీ 350వ ప్రకాశ్ పర్వ్ లను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్స్ఫూర్తితో కాశీ తమిళ సంగమంసౌరాష్ట్ర తమిళ సంగమం వంటి పండుగలను జరుపుకునే సంప్రదాయాన్ని కూడా మా ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ సంఘటనల నుండి కొత్త తరాలు జాతి నిర్మాణానికి ప్రేరణ పొందుతాయి మరియు జాతీయ గర్వ భావన బలపడుతుంది.

గౌరవనీయ సభ్యులారా,

25. మన విజయాలు మన భాగస్వామ్య వారసత్వం.

కాబట్టి మనం గర్వపడాలివాటిని స్వీకరించడానికి వెనుకాడకూడదు.

ప్రస్తుతం భారత్ వివిధ రంగాల్లో మెరుగైన పనితీరు కనబరుస్తోంది.

ఈ విజయాలు మన పురోగతి మరియు విజయాల గురించి గర్వపడేలా చేయడానికి అపారమైన అవకాశాలను ఇస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తున్నప్పుడు మనం గర్వపడాలి.

చంద్రుడి దక్షిణ ధృవంపై మన శాస్త్రవేత్తలు చంద్రయాన్ ను విజయవంతంగా ల్యాండ్ చేసినప్పుడు మనం గర్వపడాలి.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించినప్పుడు మనం గర్వపడాలి.

హింసగందరగోళం లేకుండా భారతదేశం ఇంత పెద్ద ఎన్నికల ప్రక్రియను నిర్వహించినప్పుడు మనం కూడా గర్వపడాలి.

 నేడు ప్రపంచమంతా మనల్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా గౌరవిస్తోంది.

భారత ప్రజలు ఎల్లప్పుడూ ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకాన్ని ప్రదర్శించారు మరియు ఎన్నికల వ్యవస్థలపై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

మన బలమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి మనం ఈ నమ్మకాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది.

ప్రజాస్వామ్య వ్యవస్థలపైఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయడమంటే మనమందరం కూర్చున్న శాఖనే నరికివేసినట్లేనని గ్రహించాలి.

ప్రజాస్వామ్య విశ్వసనీయతను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని సమష్టిగా ఖండించాలి.

బ్యాలెట్ పత్రాలను లాక్కుని దోచుకున్న రోజులు మనందరికీ గుర్తున్నాయి.

ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈవీఎంలను వినియోగించాలని నిర్ణయించారు.

గత కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టు నుంచి ప్రజాకోర్టు వరకు ప్రతి పరీక్షలోనూ ఈవీఎంలు ఉత్తీర్ణత సాధించాయి.

గౌరవనీయ సభ్యులారా,

26. నా ఆందోళనల్లో కొన్నింటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

ఈ సమస్యలపై ఆత్మపరిశీలన చేసుకోవాలనిదేశానికి దృఢమైననిర్మాణాత్మక పరిష్కారాలు చూపాలని కోరుతున్నాను.

కమ్యూనికేషన్ విప్లవ యుగంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచి సమాజంలో చీలికలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి.

ఈ శక్తులు దేశంలోనే ఉన్నాయి మరియు దేశం వెలుపల నుండి కూడా పనిచేస్తున్నాయి.

ఈ శక్తులు వదంతులు వ్యాపింపజేయడంప్రజలను తప్పుదోవ పట్టించడం మరియు తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి చేస్తుంటాయి.

ఈ పరిస్థితిని నిరాటంకంగా కొనసాగనివ్వలేం.

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది.

అటువంటి పరిస్థితిలోమానవాళికి వ్యతిరేకంగా దీనిని దుర్వినియోగం చేయడం చాలా హానికరం.

అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ ఈ ఆందోళనలను వ్యక్తం చేసిగ్లోబల్ ఫ్రేమ్ వర్క్ ను సూచించింది.

ఈ ధోరణిని అరికట్టడంఈ సవాలును ఎదుర్కోవడానికి కొత్త మార్గాలను కనుగొనడం మనందరి బాధ్యత.

గౌరవనీయ సభ్యులారా,

27. 21వ శతాబ్దపు ఈ మూడవ దశాబ్దంలో నేడు ప్రపంచ వ్యవస్థ కొత్త రూపు సంతరించుకుంటోంది.

మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల భారత్ విశ్వ బంధుగా ప్రపంచానికి కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది.

మానవ కేంద్రీకృత విధానాన్ని కలిగి ఉండటం వల్లఏదైనా సంక్షోభ సమయంలో భారతదేశం మొదటిగా స్పందించే మరియు గ్లోబల్ సౌత్ బలమైన గొంతుకగా మారింది.

 

మానవత్వాన్ని కాపాడటంలో భారత్ ముందంజలో ఉందిఅది కరోనా సంక్షోభం కావచ్చుభూకంపం కావచ్చుయుద్ధం కావచ్చు.

ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ ను చూసే తీరు ఇటలీలో జరిగిన జీ-7 సదస్సులో స్పష్టమైంది.

జీ-20 సదస్సులో భారత్ వివిధ అంశాలపై ప్రపంచ దేశాలను ఏకతాటిపైకి తెచ్చింది.

భారత్ అధ్యక్షత వహించిన సమయంలోనే ఆఫ్రికా యూనియన్ ను జీ-20లో శాశ్వత సభ్యదేశంగా చేశారు.

ఇది ఆఫ్రికా తో పాటు మొత్తం గ్లోబల్ సౌత్ యొక్క విశ్వాసాన్ని బలపరిచింది.

నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీని అనుసరించిభారతదేశం పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంది.

జూన్ 9న జరిగిన కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఏడు పొరుగు దేశాల నాయకులు పాల్గొనడం మా ప్రభుత్వ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.

సబ్ కా సాత్-సబ్ కా వికాస్ స్ఫూర్తితో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో భారత్ సహకారాన్ని పెంచుకుంటోంది.

తూర్పు ఆసియా అయినామధ్యప్రాచ్యం అయినాయూరప్ అయినా కనెక్టివిటీకి మా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

భారత్ దార్శనికతే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ కు రూపం ఇచ్చింది.

ఈ కారిడార్ 21వ శతాబ్దపు అతిపెద్ద గేమ్ ఛేంజర్లలో ఒకటిగా నిలుస్తుంది.

గౌరవనీయ సభ్యులారా,

28. మరికొద్ది నెలల్లో భారత్ రిపబ్లిక్ గా 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది.

భారత రాజ్యాంగం గత దశాబ్దాల్లో ప్రతి సవాలునుప్రతి పరీక్షను తట్టుకుని నిలబడింది.

రాజ్యాంగం తయారయ్యేనాటికిభారతదేశం విఫలం కావాలని కోరుకున్న శక్తులు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్నాయి.

దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అనేకసార్లు రాజ్యాంగంపై దాడి జరిగింది.

ఈ రోజు జూన్ 27.

1975 జూన్ 25న అమల్లోకి వచ్చిన ఎమర్జెన్సీ రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడిలో అతిపెద్దచీకటి అధ్యాయం.

 దీంతో యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

కానీ రిపబ్లిక్ సంప్రదాయాలు భారతదేశానికి మూలాధారంగా ఉన్నందున ఇటువంటి రాజ్యాంగ విరుద్ధ శక్తులపై దేశం విజయం సాధించింది.

మా ప్రభుత్వం కూడా భారత రాజ్యాంగాన్ని కేవలం పాలనా మాధ్యమంగా పరిగణించదుబదులుగా మన రాజ్యాంగం ప్రజా చైతన్యంలో ఒక భాగం అయ్యేలా మేము ప్రయత్నాలు చేస్తున్నాము.

ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా ప్రభుత్వం నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించింది.

ఆర్టికల్ 370 కారణంగా పరిస్థితులు భిన్నంగా ఉన్న భారతదేశంలోని ఆ భాగంలోమన జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు రాజ్యాంగం పూర్తిగా అమల్లోకి వచ్చింది.

గౌరవనీయ సభ్యులారా,

29. మన బాధ్యతలను నిర్వర్తించడంలో మన చిత్తశుద్ధిని బట్టి దేశం సాధించిన విజయాలు నిర్ణయించబడతాయి.

18వ లోక్ సభలో తొలిసారిగా అనేక మంది కొత్త సభ్యులు పార్లమెంటరీ వ్యవస్థలో భాగమయ్యారు.

పాత సభ్యులు కూడా కొత్త ఉత్సాహంతో తిరిగి వచ్చారు.

ప్రస్తుత కాలం భారతదేశానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉందని మీ అందరికీ తెలుసు.

రాబోయే సంవత్సరాల్లో భారత ప్రభుత్వంపార్లమెంటు తీసుకునే నిర్ణయాలువిధానాలను యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తుంది.

ఈ అనుకూల కాలంలో దేశానికి అత్యధిక ప్రయోజనాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పార్లమెంటు సభ్యుడితో పాటు ప్రభుత్వంపైనా ఉంది.

గత పదేళ్లలో చేపట్టిన సంస్కరణలుదేశంలో నూతన విశ్వాసం నింపడంతో భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు కొత్త ఊపు వచ్చింది.

భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం దేశంలోని ప్రతి పౌరుడి ఆకాంక్ష మరియు సంకల్పం అని మనమందరం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

ఈ తీర్మాన సాధనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

విధానాలను వ్యతిరేకించడంపార్లమెంటరీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం రెండు వేర్వేరు విషయాలు.

పార్లమెంటు తన కార్యకలాపాలను సజావుగా నిర్వహించినప్పుడుఇక్కడ ఆరోగ్యకరమైన చర్చలు జరిగినప్పుడుదూరదృష్టితో కూడిన నిర్ణయాలు తీసుకున్నప్పుడుప్రజలు ప్రభుత్వంపైనే కాకుండా మొత్తం వ్యవస్థపై విశ్వాసం ఉంచుతారు.

అందువల్ల పార్లమెంటులోని ప్రతి క్షణాన్ని పూర్తిగా వినియోగించుకుంటామనిప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని నేను విశ్వసిస్తున్నాను.

గౌరవనీయ సభ్యులారా,

30. మన వేదాలలో మన ఋషులు సందేశంతో మనకు ప్రేరణనిచ్చారు "సమనో మంత్ర సమితి సమనీ".

అంటేమేము ఒక ఉమ్మడి ఆలోచన మరియు లక్ష్యంతో కలిసి పనిచేస్తాము.

ఇదే ఈ పార్లమెంటు స్ఫూర్తి.

అందువల్లభారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినప్పుడుమీరు కూడా ఈ విజయంలో భాగస్వాములు అవుతారు.

2047లో వందో స్వాతంత్య్ర దినోత్సవాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా జరుపుకుంటే ఈ తరానికి కూడా ఆ ఘనత దక్కుతుంది.

నేటి మన యువతకు ఉన్న సామర్థ్యం,

ఈ రోజు మన తీర్మానాలలో మనకున్న అంకితభావం,

అసాధ్యం అనిపించిన మన విజయాలు,

ఇవన్నీ రాబోయే యుగం భారతదేశ శకం అని రుజువు చేస్తున్నాయి.

ఈ శతాబ్దం భారతదేశ శతాబ్దందాని ప్రభావం రాబోయే వెయ్యి సంవత్సరాలు ఉంటుంది.

మనమందరం కలిసిమన విధుల పట్ల పూర్తి అంకితభావంతోజాతీయ తీర్మానాలను నెరవేర్చడంలో చురుకుగా పాల్గొంటూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చేద్దాం.

మీ అందరికీ శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

జై హింద్!

జై భారత్!

***



(Release ID: 2029422) Visitor Counter : 13