ప్రధాన మంత్రి కార్యాలయం

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్నిస్వీకరించిన శ్రీ పేమా ఖాండూ కు  కుఅభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 JUN 2024 1:31PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా శ్రీ పేమా ఖాండూ పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.

పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన ఇతర మంత్రుల కు కూడా ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేస్తూ, వారు ప్రజల కు సేవ చేసే ప్రయాసల లో రాణించాలని, ఇప్పటి కంటే ఎక్కువ అభివృద్ధి కి పూచీ పడాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ పేమా ఖాండూ గారి కి ఇవే అభినందన లు. మంత్రులు గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన వారందరికీ కూడా నేను అభినందన లు తెలియజేయ దలచాను. వారు ప్రజల కు సేవ చేయడం లో రాణించాలని కోరుకొంటూ వారికి ఇవే నా శుభాకాంక్షలు. రాష్ట్రం మరింత వేగవంతం గా అభివృద్ధి చెందేటట్లు ఈ జట్టు చూస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/RT



(Release ID: 2025007) Visitor Counter : 43