భారత ఎన్నికల సంఘం
రేపటి నాలుగో దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరగనున్న 96 లోక్సభ నియోజకవర్గాల్లో 17.7 కోట్ల మంది ఓటర్లు.. 1.92 లక్షల పోలింగ్ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్లోని 175 శాసనసభ స్థానాలతో పాటు ఒడిశాలోని 28 శాసనసభ స్థానాలకు కూడా ఈ దశలో ఎన్నికలు
పోలింగ్ రోజున వడగాల్పులపై సూచనలు లేదు; సాధారణం నుండి సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రత (±2 డిగ్రీలు) అంచనా వేయబడింది
తెలంగాణలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు పోలింగ్ సమయం పెంపు
Posted On:
12 MAY 2024 3:43PM by PIB Hyderabad
రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్కు భారత ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 4వ దశలో 10 రాష్ట్రాలు/యూటీలలోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ 175 స్థానాలు మరియు ఒడిశా రాష్ట్ర శాసనసభ 28 స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కమిషన్ (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) పోలింగ్ సమయాన్ని పెంచింది.
ఐఎండీ సూచన ప్రకారం నాలుగో విడత పోలింగ్కు వేడి వాతావరణ పరిస్థితులకు సంబంధించి ఎటువంటి అలర్ట్లు లేవు. ఎన్నికలు జరగనున్న పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే (±2 డిగ్రీలు) సాధారణ ఉష్ణోగ్రతలు (±2 డిగ్రీలు) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా ఓటర్ల సౌకర్యార్థం అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, షామియానా, ఫ్యాన్ తదితర సౌకర్యాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఇప్పటివరకు మూడు విడతల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 283 లోక్సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా మరియు ప్రశాంతంగా ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.
నాలుగోదశ పోలింగ్ సమాచారం:
- 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటరీ నియోజకవర్గాలకు (జనరల్-64; ఎస్టీ-12; ఎస్సీ-20) మే 13, 2024న పోలింగ్ నిర్వహించబడుతుంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది (పోల్ సమయాల ముగింపు పోలింగ్ కేంద్రాల వారీగా మారవచ్చు)
- ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు (జనరల్-139; ఎస్టీ-7; ఎస్సీ-29) మరియు ఒడిశా శాసనసభలోని 28 స్థానాలకు (జనరల్-11; ఎస్టీ-14; ఎస్సీ-3) ఏకకాలంలో దశలవారీగా ఎన్నికలు జరుగుతాయి.
- 2024 లోక్సభ ఎన్నికల నాలుగో విడత ఎన్నికల్లో పోటీ చేసేందుకు 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4వ దశ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సగటు సంఖ్య 18.
- మూడు రాష్ట్రాల్లో (ఏపీ-02, జార్ఖండ్- 108; ఒడిశా -12) 4వ దశలో పోలింగ్ మరియు భద్రతా అధికారులను తీసుకెళ్లేందుకు 122 ఎయిర్ లిప్ట్లు జరిగాయి.
- 1.92 లక్షల పోలింగ్ స్టేషన్లలో 17.7 కోట్ల మంది ఓటర్లను 19 లక్షల మంది పోలింగ్ అధికారులు స్వాగతించనున్నారు.
- మొత్తం 17.70 కోట్ల మంది ఓటర్లలో 8.97 కోట్ల మంది పురుషులు, 8.73 కోట్ల మంది మహిళలు.
- నాలుగోదశ ఎన్నికలకు సంబంధించి 85 ఏళ్లు దాటిన 12.49 లక్షల మంది నమోదిత మరియు 19.99 లక్షల మంది దివ్యాంగుల ఓటర్లు తమ ఇళ్లలో నుండే ఓటు వేసే అవకాశం కల్పించారు. ఐచ్ఛిక హోమ్ ఓటింగ్ సదుపాయం ఇప్పటికే అద్భుతమైన ప్రశంసలు మరియు ప్రతిస్పందనను పొందుతోంది.
- 2024 సార్వత్రిక ఎన్నికల 4వ దశకు సంబంధించి 364 మంది పరిశీలకులు (126 సాధారణ పరిశీలకులు, 70 మంది పోలీసు పరిశీలకులు, 168 వ్యయ పరిశీలకులు) ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఇప్పటికే తమ నియోజకవర్గాలకు చేరుకున్నారు. వారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడానికి కమిషన్ యొక్క కళ్ళు మరియు చెవులుగా పనిచేస్తారు.వీరికి అదనంగా కొన్ని రాష్ట్రాలలో ప్రత్యేక పరిశీలకులను నియమించారు.
- మొత్తం 4661 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 4438 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్లు, 1710 వీడియో సర్వైలెన్స్ టీమ్లు మరియు 934 వీడియో వ్యూయింగ్ టీమ్లు ఓటర్లను ఏ విధమైన ప్రేరేపితమైనా కఠినంగా మరియు వేగంగా ఎదుర్కోవడానికి 24 గంటలూ నిఘా ఉంచుతున్నాయి.
- మొత్తం 1016 అంతర్ రాష్ట్రాలు మరియు 121 అంతర్జాతీయ సరిహద్దు చెక్ పోస్ట్లు మద్యం, మాదకద్రవ్యాలు, నగదు మరియు ఉచితాల అక్రమ ప్రవాహంపై గట్టి నిఘా ఉంచాయి. సముద్ర, వాయు మార్గాల్లో గట్టి నిఘా ఉంచారు.
- నీరు, షెడ్, టాయిలెట్లు, ర్యాంపులు, వాలంటీర్లు, వీల్చైర్లు మరియు విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు వృద్ధులు మరియు వికలాంగులతో సహా ప్రతి ఓటరు సులభంగా ఓటు వేయగలరని నిర్ధారించడానికి హామీ ఇవ్వబడింది.
- నమోదైన ఓటర్లందరికీ ఓటరు సమాచార స్లిప్లు పంపిణీ చేయబడ్డాయి. ఈ స్లిప్పులు సులభతర చర్యగా మరియు ఓటు వేయమని కమిషన్ నుండి ఆహ్వానంగా కూడా పనిచేస్తాయి.
- ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను మరియు పోలింగ్ తేదీని ఈ లింక్ ద్వారా https://electoralsearch.eci.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు
- పోలింగ్ స్టేషన్లలో గుర్తింపు ధృవీకరణ కోసం ఓటర్ ఐడి కార్డ్ (ఈపిఐసి) కాకుండా 12 ప్రత్యామ్నాయ పత్రాలను కూడా కమిషన్ ఆమోదిస్తుంది. ఓటరు ఓటర్ల జాబితాలో నమోదై ఉంటే వీటిలో ఏదైనా పత్రాన్ని చూపించి ఓటు వేయవచ్చు. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాల కోసం ఈసీఐ ఆర్డర్కి లింక్ చేయండి:https://www.eci.gov.in/eci-backend/public/api/download?url=LMAhAK6sOPBp%2FNFF0iRfXbEB1EVSLT41NNLRjYNJJP1KivrUxbfqkDatmHy12e%2FzPjtmHy12e%2FzPjtV8FZ Q2199MM81QYarA39BJWGAJqpL2w0Jta9CSv%2B1yJkuMeCkTzY9fhBvw%3D%3D
లోక్సభ 2019కి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటింగ్కు సంబంధించిన డేటా క్రింది లింక్లలో అందుబాటులో ఉంది: https://old.eci.gov.in/files/file/13579-13-pc-wise-voters-turn-out/ మూడో దశ ఎన్నికల వరకూ వోటర్ టర్న్ అవుట్ యాప్ డిస్ప్ కొత్త ఫీచర్తో అప్డేట్ చేయబడింది. దశల వారీగా/రాష్ట్రాల వారీగా/నియోజక వారీగా/పోలింగ్ కేంద్రాలవారీగా పోలింగ్ డేటా పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి రాత్రి 7 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత అది పోలింగ్ పార్టీల రాకపై నిరంతరం నవీకరించబడుతుంది.
(Release ID: 2020419)
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam