ప్రధాన మంత్రి కార్యాలయం

సిఐఎస్ఎఫ్ సిబ్బంది కి వారి సంస్థ స్థాపక దినంసందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి 

Posted On: 10 MAR 2024 5:16PM by PIB Hyderabad

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది కి వారి సంస్థ యొక్క స్థాపక దినం సందర్భంలో శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

 

 

ఎక్స్ మాధ్యం లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఈ స్థాపక దినం గర్వకారణమైనటువంటిది మరియు వైభవోపేతమైనటువంటిది కావాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం లో కీలక మౌలిక సదుపాయాల ను పరిరక్షించడం లో వారు చాటుతున్న సమర్పణ భావం మరియు వారి యొక్క నిఘా సాటిలేనటువంటివి గా ఉంటున్నాయి. వారి యొక్క వృత్తికౌశల్యం మరియు ఉత్కృష్టత లు భద్రత జగతి లో ఒక ఘనమైన ప్రమాణాన్ని ఏర్పరచాయి. @CISFHQrs’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 2013870) Visitor Counter : 48