ప్రధాన మంత్రి కార్యాలయం

జమ్ము, కశ్మీర్ లో 32,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల నుప్రారంభించడం, దేశ ప్రజల కుఅంకితం ఇవ్వడం తో పాటు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి


ఐఐటి భిలాయి, ఐఐటి తిరుపతి, ఐఐఐటిడిఎమ్ కర్నూలు, ఐఐఎమ్ బోధ్ గయ, ఐఐఎమ్ జమ్ము, ఐఐఎమ్ విశాఖపట్నంమరియు ఇండియన్ ఇన్స్‌ టిట్యూట్ ఆఫ్ స్కిల్స్  (ఐఐఎస్) కాన్‌పుర్ ల వంటి అనేక ప్రధాన విద్య సంస్థలకేంపస్ లను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు

దేశవ్యాప్తం గా ఉన్నత విద్య సంస్థల లో మౌలిక సదుపాయాలఉన్నతీకరణ కు ఉద్దేశించిన అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడాచేశారు

ఎఐఐఎమ్ఎస్ జమ్ము ను ప్రారంభించారు

జమ్ము విమానాశ్రయం యొక్క క్రొత్త టర్మినల్ భవనంనిర్మాణాని కి, అలాగే జమ్ము లో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియమ్ డిపో కు కూడా శంకుస్థాపనచేశారు

జమ్ము, కశ్మీర్ లో అనేక ముఖ్య రహదారి సంబంధి మరియు రైలు మార్గ సంబంధి ప్రాజెక్టుల నుదేశ ప్రజల కు అంకితం ఇవ్వడం తో పాటుగా శంకుస్థాపన లు చేశారు

జమ్ము, కశ్మీర్ లో పౌర ప్రధానమైన మౌలిక సదుపాయాలు మరియు పట్టణ ప్రాంతాలకు  సంబంధించిన మౌలిక సదుపాయాల పటిష్టీకరణ కుఉద్దేశించిన అనేక ప్రాజెక్టుల ను ప్రారంభించడం తో పాటు శంకుస్థాపన కూడాచేశారు

‘‘ఈ రోజు నచేపట్టిన కార్యక్రమాలు జమ్ము, కశ్మీర్ లో సమగ్ర అభివృద్ధి కి ఊతం గా నిలుస్తాయి’’

‘‘ ‘వికసిత్ జమ్ము, కశ్మీర్’ ఆవిష్కారాని కి మేంహామీ ఇస్తాం’’

‘‘వికసిత్ జమ్ము, కశ్మీర్ ను ఆవిష్కరించడానికి గాను పేదలు, రైతులు, యువత, ఇంకా నారీశక్తి లపట్ల ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది’’

‘‘ప్రస్తుత తరం వారికి ఆధునిక విద్య ను అందించడం కోసంన్యూ ఇండియా అధికంగా నిధుల ను ఖర్చు పెడుతోంది’’

‘‘ ‘సబ్‌కాసాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ మరియు సబ్‌కా ప్రయాస్’ మంత్రంజమ్ము, కశ్మీర్ లోనూఅభివృద్ధి కి పునాది గా ఉంది’’

‘‘భారతదేశరాజ్యాంగం లో వాగ్దానం చేసినటువంటి సామాజిక న్యాయం తాలూకు హామీ ని జమ్ము, కశ్మీర్ లో సామాన్య ప్రజానీకం మొట్టమొదటిసారి గా అందుకొంటున్నారు’’

‘‘జమ్ము, కశ్మీర్ అభివృద్ధి కి అతి పెద్ద అడ్డంకి గా ఉంటూవచ్చిన 370వ అధికరణం రద్దుకావడం తో, ఒక క్రొత్త జమ్ము, కశ్మీర్ రూపు దాల్చుతోంది’’

‘‘వికసిత్ జమ్ము, కశ్మీర్ భావన పట్ల ప్రపంచం ఉద్వేగభరితం అవుతోంది’’

Posted On: 20 FEB 2024 2:15PM by PIB Hyderabad

ముప్ఫై రెండు వేల కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము లో ఈ రోజు న ప్రారంభించి, వాటి ని దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు ఆరోగ్యం, విద్య, రహదారులు, రైలు మార్గాలు, విమానయానం, పెట్రోలియమ్ మరియు పౌర ప్రయోజనాలు ప్రధానమైన మౌలిక సదుపాయాల కల్పన రంగం తో పాటు అనేక ఇతర రంగాల కు సంబంధించినవి. జమ్ము, కశ్మీర్ లో క్రొత్త గా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసుకొన్న సుమారు 1500 మంది వ్యక్తుల కు నియామక ఉత్తర్వుల ను ప్రధాన మంత్రి అందజేశారు. ‘వికసిత్ భారత్, వికసిత్ జమ్ము’ కార్యక్రమం లో భాగం గా వేరు వేరు ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

 

 

 

కిశ్త్ వాడ్ జిల్లా కు చెందిన వీణా దేవి గారు తాను ఉజ్జ్వల యోజన యొక్క ప్రయోజనాల ను అందుకొన్నట్లు, దానితో తన జీవనం మెరుగు పడినట్లు ప్రధాన మంత్రి కి తెలియ జేశారు. ప్రస్తుతం తాను తన కుటుంబం కోసం మరియు స్వయం గా తన కోసం కాలాన్ని కేటాయించేందుకు వీలు చిక్కిందని ఆమె అన్నారు. ఇదివరకు వంట చేయడం కోసం అడవి లోకి వెళ్ళి వంట చెరకును తెచ్చుకొనేదాన్ని అని ఆమె తెలిపారు. తమ కుటుంబ సభ్యుల కు ఆయుష్మాన్ కార్డులు ఉన్నాయని ఆమె ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చి, ఈ కార్డుల జారీ కి గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వీణా దేవి గారు మరియు ఆమె కుటుంబ సభ్యులు చక్కని ఆరోగ్యం తో ఉండాలి అని ఆకాంక్షించారు.

 

రాష్ట్రీయ ఆజీవిక అభియాన్ లబ్ధిదారుల లో ఒకరైన కఠువా నివాసి కీర్తి శర్మ గారు ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ, ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) తో అనుబంధం కలిగి ఉన్నప్పడు ఒనగూరే ప్రయోజనాల ను గురించి తెలియ జేశారు. ఆమె 30,000 రూపాయల రుణం తో తన వ్యాపార సంస్థ ను ప్రారంభించారు. ఒక లక్ష రూపాయల రెండో రుణాన్ని కూడా ఆమె స్వీకరించి, ఆ సొమ్ము తో మూడు గోవుల ను సమకూర్చుకొన్నట్లు వివరించారు. ఒక్క తమ స్వయం సహాయ సమూహమే కాకుండా జిల్లా అంతటా మహిళ లు వారి సొంత కాళ్ళ మీద వారు నిలబడగలుగుతారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఆమె సభ్యురాలు గా ఉన్న సమూహం బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించివేసింది; ప్రస్తుతం వారి వద్ద 10 గోవులు ఉన్నాయి. ఆమె మరియు ఆమె గ్రూపు సభ్యులు అనేక ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి ని కూడా పొందారు. మూడు కోట్ల మంది లఖ్‌పతి దీదీ ల (లక్షాధికారి సోదరీమణుల)ను సిద్ధం చేయాలి అనే లక్ష్యం తో ప్రధాన మంత్రి చేపట్టిన ఈ ప్రాజెక్టు కు తమ పూర్తి సహకారాన్ని అందిస్తాం అంటూ ఆమె హామీ ని ఇచ్చారు.

 

పూంచ్ ప్రాంత రైతు శ్రీ లాల్ మొహమ్మద్ ప్రధాన మంత్రి తో మాట్లాడుతూ, తాను ఒక సరిహద్దు ప్రాంత నివాసి ని అని పరిచయం చేసుకొన్నారు. తన కు ఒక చిన్న మట్టితో కట్టిన ఇల్లు ఉండేదని, సరిహద్దు కు అవతలి వైపు నుండి ఇంటి మీదకు తుపాకి గుండ్లు దూసుకు వస్తూ ఉండేవన్నారు. పక్కా ఇంటి ని కట్టుకోవడం కోసం పిఎమ్ ఆవాస్ యోజన లో భాగం గా 1,30,000 రూపాయలు అందాయని, ప్రస్తుతం తాను ఆ విధం గా కట్టుకొన్న ఇంట్లో తలదాచుకొంటున్నానని శ్రీ లాల్ మొహమ్మద్ ప్రధాన మంత్రి కి చెప్తూ, ఆయన కు తన ధన్యవాదాల ను తెలియ జేశారు. ప్రభుత్వం యొక్క పథకాలు దేశం లో సుదూర ప్రాంతాల కు చేరుకొంటూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ లాల్ మొహమ్మద్ కు పక్కా ఇల్లు సమకూరినందుకు అభినందనల ను తెలియ జేశారు. శ్రీ లాల్ మొహమ్మద్ తన వంతు గా ప్రధాన మంత్రి ని ప్రశంసిస్తూ, ‘వికసిత్ భారత్’ ఇతివృత్తం ప్రధానం గా సాగిన ఒక రెండు పంక్తుల ను వినిపించారు.

 

బాందీపురా కు చెందిన శహీనా బేగం గారు ఒక స్వయం సహాయ సమూహం (ఎస్‌హెచ్‌జి) లో సభ్యురాలు. ప్రధాన మంత్రి తో ఆమె మాట్లాడుతూ, సమాజ శాస్త్రం లో తాను స్నాతకోత్తర పట్టా ను సాధించినప్పటికీ నిరుద్యోగం కారణం గా ఎన్నో ఇబ్బందుల ను ఎదుర్కోక తప్పలేదు అంటూ వివరించారు. 2018వ సంవత్సరం లో ఆమె స్వయం సహాయ సమూహం లో చేరారు. తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం ఆమె రుణాన్ని స్వీకరించారు. ఆ తరువాత నేశనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిశన్ యొక్క సహాయాన్ని అందుకొని, ఆ వ్యాపారాన్ని మరింత గా విస్తరించారు. దీనితో ఆమె తాను ఎంచుకొన్న రంగం లో గుర్తింపు ను తెచ్చుకొని, ఒక లఖ్‌పతి దీదీ (లక్షాధికారి సోదరీమణి)గా ఎదిగారు. ప్రధాన మంత్రి ఆమె కు అభినందనల ను తెలియ జేసి, మారుమూల గ్రామాల లో ఉండే మహిళ లు లఖ్‌పతి దీదీ లు గా మారేందుకు వారికి లభిస్తున్న అవకాశాల ను సంతోషం తో అందుకొంటున్నారు అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శహీనా బేగం గారు ప్రేరణ ను పొందారు అని ఆయన అన్నారు. ఆమె తిరిగి మాట్లాడుతూ, కోళ్ళ పెంపకం వ్యాపారం కోసం కిసాన్ క్రెడిట్ కార్డు తాలూకు ప్రయోజనాల ను వినియోగించుకొన్నట్లు వెల్లడించారు. ఆమె ను స్నాతకోత్తర స్థాయి వరకు చదివించిన ఆమె తల్లితండ్రుల ను ప్రధాన మంత్రి కొనియాడారు. శహీనా బేగం లో శ్రమ పట్ల గల సమర్పణ భావం ప్రశంసనీయం అని కూడా ఆయన అన్నారు. మహిళ లు వారు కన్న కలల ను నెరవేర్చుకోవడం తో పాటు సాధికారిత దిశ లో పయనించడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘మోదీ యొక్క హయాం లో ప్రతిదీ సాధ్యమే.’’ అన్నారు.

 

జల్ జీవన్ మిశన్ లబ్ధిదారుల లో పుల్‌వామా కు చెందిన శ్రీ రియాజ్ అహమద్ కోలీ ఒకరు. ప్రధాన మంత్రి తో ఆయన మాట్లాడుతూ, తమ పల్లె లో ప్రతి ఒక్క ఇంటి కి నల్లా నీరు అందుతోందని, ఇది తన కుటుంబ సభ్యుల జీవనం లో ఒక పెనుమార్పు ను తీసుకు వచ్చిందన్నారు. తమ గ్రామం లోని మహిళ ల ఆశీర్వాదాల ను ఆయన ప్రధాన మంత్రి కి తెలియ జేశారు. 370వ అధికరణం రద్దు అయిన తరువాత ఆయన ఆయనకు ఉన్న భూమి యొక్క హక్కుల ను చేజిక్కించుకొన్నారు. దీని తో ఆయనతో పాటు ఆయన కు చెందిన ఆదివాసి సముదాయం లోని ఇతర సభ్యులు కూడా ఎంతగానో లాభపడ్డారు. ప్రధాన మంత్రి ఒక రాజకీయ కార్యకర్త గా తాను ఉన్న రోజుల ను తలచుకొంటూ గుజ్జర్ సముదాయం అందించినటువంటి ఆతిధ్యం పట్ల ప్రశంస ను వ్యక్తం చేశారు.

 

 

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, జమ్ము కు ఇదివరకు తాను వచ్చిన సందర్బాల తో పోలిస్తే ఈ రోజు న ప్రజలు ప్రతికూల వాతావరణ స్థితి లో సైతం ఉత్సాహం గా పెద్ద సంఖ్యల లో తరలి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద తెర ల మీద చూడడం కోసం మూడు వేరు వేరు సభా ప్రాంగణాల వద్ద జమ్ము పౌరులు భారీ సంఖ్యల లో గుమికూడారు అని కూడా ఆయన తెలియ జేశారు. జమ్ము, కశ్మీర్ ప్రజల లోని ఉత్సాహాన్ని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమాన్ని ఒక దీవెన అని అభివర్ణించారు. ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమం వికసిత్ భారత్ కే పరిమితం కాదు, మరి దీనిలో దేశవ్యాప్తం గా వేరు వేరు విద్య సంస్థల కు చెందిన వారు లక్షల సంఖ్య లో పాలుపంచుకొంటున్నారు అని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. ఈ కార్యక్రమాన్ని జమ్ము, కశ్మీర్ లో ఉన్న 285 బ్లాకుల లోని పౌరులు చూస్తున్నారని, ఆయన చెప్తూ, ఈ కేంద్ర పాలిత ప్రాంతం యొక్క ప్రజల లో వ్యక్తం అవుతున్న ఉత్సాహాన్ని ఆయన మెచ్చుకొన్నారు.

 

 

ప్రధాన మంత్రి తనతో సంభాషించిన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల వల్ల సమకూరుతున్న లాభాల ను గురించి వారి భావాల ను సూటి గాను, స్పష్టం గాను వ్యక్తం చేసిన తీరు ను ప్రశంసించారు. వికసిత్ భారత్ వికసిత్ జమ్ము, కశ్మీర్ మరియు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లంటే జమ్ము, కశ్మీర్ ప్రజల లో వ్యక్తం అవుతున్నటువంటి భావన కు గాను ప్రధాన మంత్రి వారికి అభినందనల ను తెలియ జేశారు. ప్రతి లబ్ధిదారు యొక్క ఇంటి ముంగిట కు చేరుకోవాలి అనేదే ప్రభుత్వం యొక్క నిబద్ధత అని ఆయన పునరుద్ఘాటించారు. అర్హత ఉన్న లబ్ధిదారుల ను ఎవ్వరి ని అయినా వదలి వేసే ప్రసక్తే లేదు అంటూ ఆయన హామీ ని ఇచ్చారు. ‘‘మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మనం వికసిత్ జమ్ము, కశ్మీర్ ను ఆవిష్కరించి తీరుతాం. 70 సంవత్సరాలు గా నెరవేరని కలల ను మోదీ త్వరలోనే నెరవేర్చుతాడు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

నిరాశా నిస్పృహలు, వేర్పాటు వాద రోజులను వదిలి జమ్ముకశ్మీర్ వికసిత్ గా మారే ప్రతిజ్ఞతో ముందుకు వెళ్తోందని ప్రధాన మంత్రి అన్నారు. నేటి రూ.32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు విద్య, నైపుణ్యం, ఉద్యోగాలు, ఆరోగ్యం, పరిశ్రమలు, కనెక్టివిటీకి ఊతమిస్తాయని చెప్పారు. ఐఐఎం, ఐఐటీ, అపాయింట్ మెంట్ లెటర్స్ మంజూరు సందర్భంగా దేశ యువతకు అభినందనలు తెలిపారు.

జమ్ముకశ్మీర్ అనేక తరాలుగా వారసత్వ రాజకీయాలకు బలైపోయిందని, అక్కడ ప్రజల సంక్షేమం పూర్తిగా విస్మరించబడిందని, యువత తీవ్రంగా నష్టపోయిందని, ఆ ప్రభుత్వాలు యువత కోసం విధానాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాన మంత్రి అన్నారు. సొంత కుటుంబాల సంక్షేమం గురించి ఆలోచించే వారు సామాన్య పౌరుల గురించి ఎప్పుడూ ఆలోచించరని ప్రధాని మోదీ అన్నారు. కేంద్రపాలిత ప్రాంతంలో వారసత్వ రాజకీయాలు ఇప్పుడు అంతమవుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

వికసిత్ జమ్ముకశ్మీర్ ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, నారీ శక్తిపై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి చెప్పారు. జమ్ముకశ్మీర్ విద్య , నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ విద్య, నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కేంద్రంగా నిలుస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్ లో ఐఐటీ, ఐఐఎం ఏర్పాటుకు 2013లో ఇదే వేదికపై హామీ ఇచ్చిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆ హామీని నేడు నెరవేరుస్తున్నామని చెప్పారు. అందుకే ప్రజలు మోదీ హామీ అంటే హామీ నెరవేరే గ్యారంటీ అని అంటున్నారని ఆయన అన్నారు.

నేటి కార్యక్రమంలో విద్యా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాలు ఈ స్థాయిలో పురోగతి సాధించడం పదేళ్ల క్రితం సుదూర వాస్తవమని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. "కానీ, ఇది కొత్త భారతదేశం" అని ప్రధాన మంత్రి అన్నారు. "కానీ, ఇది నవ భారతం" అని ప్రధాన మంత్రి అన్నారు, ప్రస్తుత ,  భవిష్యత్ తరాల ఆధునిక విద్య కోసం నేటి ప్రభుత్వం గరిష్ట వ్యయం చేస్తోందని తెలిపారు. గత పదేళ్లలో జమ్ముకశ్మీర్ లో 50 కొత్త డిగ్రీ కాలేజీలతో సహా దేశంలో రికార్డు స్థాయిలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఏర్పాటు అయ్యాయని  శ్రీ మోదీ తెలిపారు. పాఠశాలలకు హాజరుకాని 45 వేల మంది పిల్లలను కొత్తగా చేర్చుకున్నామని, బాలికలు చదువు కోసం దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని సంతోషం వ్యక్తం చేశారు. ఒకప్పుడు పాఠశాలలు నడిచేవని, నేడు పాఠశాలలు పెరిగాయని ప్రధాని మోదీ అన్నారు.

జమ్ముకశ్మీర్ లో ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపడటం గురించి ప్రస్తావిస్తూ, 2014లో నాలుగు గా ఉన్న వైద్య కళాశాలల సంఖ్య ఈ రోజు 12కు పెరిగిందని, 2014లో 500 నుంచి 1300కు పైగా ఎంబీబీఎస్ సీట్లు, 2014లో ఒక్కటి కూడా లేని విధంగా 650కు పైగా పీజీ మెడికల్ సీట్లు వచ్చాయని ప్రధాని తెలిపారు. గత నాలుగేళ్లలో 45 నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ లో రెండు ఎయిమ్స్ లు రానుండగా  వాటిలో జమ్మూ ఎయిమ్స్ ను ప్రధాన మంత్రి ఈ రోజు ప్రారంభించారు. గత పదేళ్లలో దేశంలో 15 కొత్త ఎయిమ్స్ లు మంజూరయ్యాయని ప్రధాని మోదీ తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు గురించి ప్రస్తావిస్తూ, దాని అభివృద్ధికి అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని, ఈ ప్రాంతం సమతుల్య అభివృద్ధి దిశలో పయనిస్తున్నందున కొత్త జమ్మూ కాశ్మీర్ ఉనికిలోకి వస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ఆర్టికల్ 370పై రాబోయే సినిమా గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరూ వెనుకబడరని, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వారు ఇప్పుడు సమర్థవంతమైన ప్రభుత్వం ఉనికిని అనుభవించగలరనే నమ్మకాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. వారసత్వ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు దూరంగా దేశంలో కొత్త కెరటం ఎగసి పడిందని ఆయన పేర్కొన్నారు. "జమ్ముకశ్మీర్ యువత అభివృద్ధి ని ఆస్వాదిస్తూ తమ భవిష్యత్తును సృష్టించుకోవడానికి ముందుకు సాగుతున్నారు" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, కేంద్రపాలిత ప్రాంతంలో వాతావరణంలో సానుకూల మార్పును ఆయన ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్ ప్రజలతో పాటు రక్షణ సిబ్బంది పట్ల గత ప్రభుత్వాలు చూపిన నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ప్రాంతానికి చెందిన వారితో సహా మాజీ సైనికులకు ప్రయోజనాలు కల్పిస్తూ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం దీర్ఘకాలిక డిమాండ్ ను ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చిందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

సామాజిక న్యాయం అనే రాజ్యాంగ వాగ్దానం చివరకు శరణార్థి కుటుంబాలకు, బల్మికి కమ్యూనిటీకి, సఫాయి కర్మచారులకు చేరిందని ప్రధాన మంత్రి అన్నారు. బల్మికి కమ్యూనిటీకి ఎస్సి హోదా లభించడంతో ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్ నెరవేరిందని ప్రధాని అన్నారు. పడారి, పహారీ, గడ్డ బ్రాహ్మణులు, కోలీలను షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చారు. శాసనసభలో ఎస్టీలకు రిజర్వేషన్లు, పంచాయితీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్లను ప్రస్తావిస్తూ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ మంత్రమే జమ్మూకశ్మీర్ అభివృద్ధికి పునాది అని ప్రధాని అన్నారు.

జమ్ముకశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్ల మహిళలు ఎక్కువ లబ్ధి పొందారని అంటూ పీఎం ఆవాస్ యోజన కింద మహిళల పేరు మీద పక్కా గృహాలు, హర్ ఘర్ జల్ పథకం కింద మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ కార్డుల పంపిణీ వంటి అంశాలను ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల మహిళలకు గతంలో కోల్పోయిన హక్కులు తిరిగి లభించాయని అన్నారు.

నమో డ్రోన్ దీదీ పథకాన్ని ప్రధాని ప్రస్తావించారు, ఇక్కడ మహిళలు డ్రోన్ పైలట్లుగా మారడానికి పెద్ద సంఖ్యలో శిక్షణ పొందుతున్నారు. వ్యవసాయం, తోటల పెంపకంలో సహాయపడటానికి వేలాది స్వయం సహాయక బృందాలకు లక్షల రూపాయల విలువైన డ్రోన్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసే పని మరింత సులువవుతుందని, తద్వారా వారికి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు.

నేడు దేశమంతటా ఏకకాలంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, జమ్ముకశ్మీర్ కు కనెక్టివిటీ పెరిగిందని ప్రధాన మంత్రి, పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి రైలు మార్గం ద్వారా అనుసంధానించే జమ్మూ విమానాశ్రయ విస్తరణ పనులను, శ్రీనగర్ నుంచి సంగల్దాన్, సంగల్దాన్ నుంచి బారాముల్లా వరకు నడిచే రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కశ్మీర్ నుంచి రైలులో దేశమంతా ప్రయాణించే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రైల్వేల విద్యుదీకరణకు సంబంధించి జరుగుతున్న బృహత్తర ప్రచారం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు తొలి ఎలక్ట్రిక్ రైలును పొందినందుకు జమ్మూకశ్మీర్ ప్రజలను అభినందించారు.

వందేభారత్ వంటి ఆధునిక రైళ్లను ప్రస్తావిస్తూ, రైళ్ల ప్రారంభ మార్గాల్లో జమ్ముకశ్మీర్ ను ఎంపిక చేసినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. జమ్ముకశ్మీర్ లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, మాతా వైష్ణోదేవికి ప్రవేశం మెరుగుపడిందని చెప్పారు.

ప్రధాని మోదీ ఈ ప్రాంతంలో రహదారి ప్రాజెక్టులను గురించి వివరించారు. నేటి ప్రాజెక్టులలో, శ్రీనగర్ రింగ్ రోడ్డు రెండవ దశ గురించి ఆయన ప్రస్తావించారు, ఇది మానస్బల్ సరస్సు , ఖీర్ భవానీ ఆలయానికి ప్రవేశాన్ని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా శ్రీనగర్-బారాముల్లా-యూరి హైవే రైతులకు, పర్యాటక రంగానికి మేలు చేస్తుంది. ఢిల్లీ అమృత్ సర్ కత్రా ఎక్స్ ప్రెస్ వే జమ్మూ- ఢిల్లీ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది.

"నేడు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి గురించి యావత్ ప్రపంచంలో చాలా ఉత్సాహం ఉంది" అని ప్రధాన మంత్రి అన్నారు, కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్టుబడులకు సంబంధించి సానుకూలత అధికంగా ఉన్న గల్ఫ్ దేశాలను ఇటీవల తాను సందర్శించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.

"నేడు, జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి గురించి యావత్ ప్రపంచంలో చాలా ఉత్సాహం ఉంది" అని ప్రధాన మంత్రి అన్నారు, కేంద్ర పాలిత ప్రాంతంలో పెట్టుబడులకు సంబంధించి సానుకూలత అధికంగా ఉన్న గల్ఫ్ దేశాలను ఇటీవల తాను సందర్శించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు జీ-20 సమావేశాలను ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, ప్రపంచం మొత్తం అక్కడి ప్రకృతి సౌందర్యానికి మంత్ర ముగ్ధమైందని అన్నారు. జమ్ముకశ్మీర్ లో గత ఏడాది రెండు కోట్లకు పైగా సందర్శకులు వచ్చారని, అమర్ నాథ్, శ్రీ మాతా వైష్ణోదేవిని సందర్శించే యాత్రికుల సంఖ్య గత దశాబ్దంలో అత్యధికానికి చేరుకుందని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.

టాప్ 5 ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ప్రవేశించడాన్ని ప్రస్తావిస్తూ, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం వల్ల సంక్షేమ పథకాలపై ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ కారణంగా భారతదేశం ఉచిత రేషన్, వైద్య చికిత్స, పక్కా గృహాలు, గ్యాస్ కనెక్షన్లు, మరుగుదొడ్లు , పిఎం కిసాన్ సమ్మాన్ నిధిని అందించగలదని ఆయన అన్నారు. “వచ్చే ఐదేళ్లలో భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నారు. దీనివల్ల పేదల సంక్షేమం, మౌలిక సదుపాయాలపై ఖర్చు చేసే సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. దీని వల్ల జమ్ముకశ్మీర్ లోని ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుంది" అని ప్రధాన మంత్రి ముగించారు.

ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

విద్యారంగానికి భారీ ఊతం

దేశ వ్యాప్తంగా విద్య, నైపుణ్య మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేయడం, అభివృద్ధి చేయడంలో భాగంగా సుమారు రూ.13,375 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేశారు.

ఐఐటీ భిలాయ్ శాశ్వతక్యాంపస్, , ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఐఐఐటీడీఎం కర్నూలు; ఐఐటి పాట్నా ,  మరియు ఐఐటి రోపర్ లో అకడమిక్ ,  రెసిడెన్షియల్ కాంప్లెక్స్; దేవప్రయాగ్ (ఉత్తరాఖండ్),  అగర్తలా (త్రిపుర) లో కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం రెండు శాశ్వత ప్రాంగణాలను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.  ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎం జమ్ము, ఐఐఎం బుద్ధగయ శాశ్వత క్యాంపస్ లను ప్రధాని ప్రారంభించారు. కాన్పూర్ లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై అగ్రగామి నైపుణ్య శిక్షణా సంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ )ను కూడా ఆయన ప్రారంభించారు.

ఐఐటీ జమ్ము, నిట్ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్ పూర్, ఎన్ ఐటీ దుర్గాపూర్, ఐఐఎస్ ఈఆర్ బెహ్రాంపూర్, నిట్ అరుణాచల్ ప్రదేశ్, ఐఐఐటీ లక్నో, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ, కేరళ సెంట్రల్ యూనివర్శిటీ కాసర్ గోడ్ వంటి దేశంలోని పలు ఉన్నత విద్యా సంస్థల్లో హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్స్, పరిపాలనా భవనాలు, లైబ్రరీలు, ఆడిటోరియంలు వంటి మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఉన్నత విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. సింధు సెంట్రల్ యూనివర్శిటీ, ఐఐఐటీ రాయచూర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణం, ఐఐటీ బాంబేలో అకడమిక్ బ్లాక్, హాస్టల్, ఫ్యాకల్టీ క్వార్టర్ నిర్మాణం; ఐఐటి గాంధీనగర్ లో హాస్టల్ , స్టాఫ్ క్వార్టర్ నిర్మాణం, బిహెచ్ యులో బాలికల హాస్టల్ నిర్మాణం మొదలైనవి ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయి.

ఎయిమ్స్ జమ్ము

జమ్మూకశ్మీర్ ప్రజలకు సమగ్ర, నాణ్య , సంపూర్ణ తృతీయ ఆరోగ్య సేవలను అందించే ఒక అడుగుగా, ప్రధాన మంత్రి జమ్ము విజయ పూర్ (సాంబా)లోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడిక ల్ సైన్సెస్ (ఎయిమ్స్ )ను ప్రారంభించారు. 2019 ఫిబ్రవరిలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద ఏర్పాటు చేస్తున్నారు.

1660 కోట్లకుపైగా వ్యయంతో 227 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆస్పత్రిలో 720 పడకలు, 125 సీట్లతో మెడికల్ కాలేజీ , 60 సీట్లతో నర్సింగ్ కళాశాల , 30 పడకలతో. ఆయుష్ బ్లాక్, , అధ్యాపకులు, సిబ్బందికి నివాస వసతి, యూజీ, పీజీ విద్యార్థులకు హాస్టల్ వసతి, నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్  ఆడిటోరియం, షాపింగ్ కాంప్లెక్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.  కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఎండోక్రినాలజీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ సహా 18 స్పెషాలిటీలు, 17 సూపర్ స్పెషాలిటీలలో అత్యాధునిక రోగి సంరక్షణ సేవలను ఈ అత్యాధునిక ఆసుపత్రి అందిస్తుంది. ఇన్స్టిట్యూట్ లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఎమర్జెన్సీ అండ్ ట్రామా యూనిట్, 20 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, డయాగ్నోస్టిక్ లేబొరేటరీస్, బ్లడ్ బ్యాంక్, ఫార్మసీ మొదలైనవి ఉంటాయి. ఈ ప్రాంతంలోని సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి ఆసుపత్రి డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కూడా ఉపయోగించుకుంటుంది.

కొత్త టెర్మినల్ భవనం, జమ్మూ విమానాశ్రయం

జమ్ము ఎయిర్ పోర్ట్ లో కొత్త టెర్మినల్ భవనానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ కొత్త టెర్మినల్ భవనంలో రద్దీ సమయాల్లో సుమారు 2000 మంది ప్రయాణీకులకు సేవలందించే అధునాతన సౌకర్యాలు ఉంటాయి. కొత్త టెర్మినల్ భవనం పర్యావరణ హితంగా, ఈ ప్రాంత స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మిస్తారు. ఇది వైమానిక కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది, పర్యాటకం , వాణిజ్యాన్ని పెంచుతుంది  ఈ ప్రాంత ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది.

రైలు ప్రాజెక్టులు

బనిహాల్-ఖరీ-సుంబర్-సంగల్దాన్ (48 కి.మీ) మధ్య కొత్త రైలు మార్గం, కొత్తగా విద్యుదీకరించిన బారాముల్లా - శ్రీనగర్- బనిహాల్- సంగల్దాన్ సెక్షన్ (185.66 కి.మీ)తో సహా జమ్మూ కాశ్మీర్ లోని వివిధ రైలు ప్రాజెక్టులను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు. లోయలో తొలి ఎలక్ట్రిక్ రైలును, సంగల్దాన్ స్టేషన్ , బారాముల్లా స్టేషన్ల మధ్య రైలు సేవలను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు.

బనిహాల్-ఖారీ-సుంబర్-సంగల్దాన్ సెక్షన్ ను ప్రారంభించడం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది మార్గం పొడవునా బలాస్ట్ లెస్ ట్రాక్ (బి ఎల్ టి) వాడకాన్ని కలిగి ఉంది, ఇది ప్రయాణీకులకు మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే, భారతదేశపు అతి పొడవైన రవాణా సొరంగం టి -50 (12.77 కి.మీ) ఖారీ-సుంబర్ మధ్య ఈ భాగంలో ఉంది. రైలు ప్రాజెక్టులు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి, పర్యావరణ సుస్థిరతను నిర్ధారిస్తాయి.  ఇంకా ఈ ప్రాంత మొత్తం ఆర్థిక అభివృద్ధిని పెంచుతాయి.

రోడ్డు ప్రాజెక్టులు

ఈ కార్యక్రమంలో భాగంగా జమ్మూ నుంచి కత్రాను కలిపే ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వే రెండు ప్యాకేజీలు (44.22 కి.మీ),  రోడ్డు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శ్రీనగర్ రింగ్ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చే రెండో దశ. ఎన్ హెచ్ -01  లో 161 కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్-బారాముల్లా-యురి రహదారిని అప్ గ్రేడ్ చేయడానికి ఐదు ప్యాకేజీలు; జాతీయ రహదారి-444 పై కుల్గాం బైపాస్ ,  పుల్వామా బైపాస్ సహా ముఖ్యమైన రోడ్డు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.

ఢిల్లీ-అమృత్ సర్-కత్రా ఎక్స్ ప్రెస్ వే రెండు ప్యాకేజీలు పూర్తయితే, పవిత్ర పుణ్యక్షేత్రం మాతా వైష్ణో దేవి సందర్శన యాత్రికులకు సులభతరం అవుతుంది.  ఈ ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధి  కూడా సాధ్యమవుతుంది. శ్రీనగర్ రింగ్ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చే రెండో దశలో ప్రస్తుతమున్న సుంబల్-వయూల్ ఎన్ హెచ్ -1ను అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. 24.7 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు శ్రీనగర్ నగరం , ఇంకా చుట్టుపక్కల ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది.

ఇది మనస్బల్ సరస్సు , ఖీర్ భవానీ ఆలయం వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.  లేహ్, లడఖ్ కు ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది; 161 కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్-బారాముల్లా-యూరి మార్గాన్ని ఎన్ హెచ్ -01లో అప్ గ్రేడ్ చేసే ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది బారాముల్లా , యురి ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది; ఖాజీగుండ్ - కుల్గాం - షోపియాన్ - పుల్వామా - బద్గాం - శ్రీనగర్ లను కలిపే ఎన్ హెచ్ -444 పై కుల్గాం బైపాస్, పుల్వామా బైపాస్ కూడా ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలను పెంచుతుంది.

సియుఎఫ్ పెట్రోలియం డిపో

జమ్మూలో సియుఎఫ్ (కామన్ యూజర్ ఫెసిలిటీ) పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.677 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ అత్యాధునిక పూర్తి ఆటోమేటెడ్ డిపోలో మోటార్ స్పిరిట్ (ఎంఎస్), హైస్పీడ్ డీజిల్ (హెచ్ ఎస్ డి ), సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్ కె ఓ), ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), ఇథనాల్, బయోడీజిల్, వింటర్ గ్రేడ్ హెచ్ఎస్. టి నిల్వ సామర్థ్యం సుమారు 100000 కె ఎల్ ఉంటుంది.

 ఇతర ప్రాజెక్టులు

జమ్ముకశ్మీర్ అంతటా పౌర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రజా సౌకర్యాల కల్పన కోసం రూ.3150 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. ప్రధాన మంత్రి ప్రారంబించిన పథకాలలో రోడ్డు పథ కాలు , బ్రిడ్జిలు:  గ్రిడ్ స్టేషన్లు, రిసీవింగ్ స్టేషన్లు ట్రాన్స్ మిషన్ లైన్ ప్రాజెక్టులు; సాధారణ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు , మురుగునీటి శుద్ధి ప్లాంట్లు; పలు డిగ్రీ కళాశాల భవనాలు; శ్రీనగర్ లో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్; ఆధునిక నర్వాల్ ఫ్రూట్ మండీ; కథువాలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ; ట్రాన్సిట్ వసతి - గండేర్బల్, కుప్వారాలో 224 ఫ్లాట్లు ఇందులో ఉన్నాయి. ఇంకా శంకుస్థాపనలు చేసిన వాటిలో జమ్ము కాశ్మీర్ వ్యాప్తంగా కొత్తగా ఐదు ఇండస్ట్రియల్ ఎస్టేట్ల నిర్మాణం, . జమ్మూ స్మార్ట్ సిటీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కోసం డేటా సెంటర్/ డిజాస్టర్ రికవరీ సెంటర్; పరింపోరా శ్రీనగర్ వద్ద ట్రాన్స్ పోర్ట్ నగర్ అప్ గ్రేడ్; 62 రోడ్డు ప్రాజెక్టులు ,  42 వంతెనలు ,  రవాణా వసతి అభివృద్ధి , అనంతనాగ్, కుల్గాం, కుప్వారా, షోపియాన్, పుల్వామా జిల్లాల్లో తొమ్మిది చోట్ల 2816 ఫ్లాట్లు ఉన్నాయి.

 

 

***

DS/TS



(Release ID: 2007462) Visitor Counter : 77