ప్రధాన మంత్రి కార్యాలయం

మిజోరమ్ రాష్ట్రప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 20 FEB 2024 10:49AM by PIB Hyderabad

మిజోరమ్ రాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు. మిజోరమ్ రాష్ట్రం నిరంతరం ప్రగతి ని సాధిస్తూ ఉండాలని, శాంతి తోను, సమృద్ధి తోను విలసిల్లేలా చూడాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రధాన మంత్రి ప్రార్థించారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘మిజోరమ్ ప్రజల కు రాష్ట్ర స్థాపన దినం సందర్భం లో ఇవే శుభాకాంక్ష లు. మిజోరమ్ యొక్క అద్వితీయమైనటువంటి సాంస్కృతిక ముఖచిత్రాన్ని, ఆ రాష్ట్రం యొక్క ఘనమైన ప్రాకృతిక శోభ ను మరియు ఆ రాష్ట్రం లోని ప్రజల లో వెల్లివిరిసే స్నేహపూర్ణమైన భావన ను చూసుకొని భారతదేశం ఎంతగానో గర్వపడుతున్నది. మిజో సంస్కృతి చాలా ప్రేరణ ను ఇచ్చేటటువంటిది, సంప్రదాయాన్ని మరియు సద్భావన ను కలబోసుకొన్నదీను. మిజోరమ్ నిరంతరం ప్రగతి పథం లో మునుముందుకు పయనించాలి, మిజోరమ్ శాంతి తో మరియు సమృద్ధి తో విలసిల్లాలి అంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST



(Release ID: 2007453) Visitor Counter : 60