ప్రధాన మంత్రి కార్యాలయం

జ‌న‌వ‌రి 27న కరియ‌ప్పా గ్రౌండ్‌లో ఎన్‌సీసీ పీఎం ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 26 JAN 2024 4:52PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 27 జనవరి, 2024న సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్‌లో వార్షిక  ఎన్‌సీసీ పీఎం ర్యాలీలో ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో అమృత్ పీడీ సహకారం, సాధికారతను ప్రదర్శించే ‘అమృత్ కాల్ కి  ఎన్‌సీసీ ’ అనే అంశంపై సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. వసుధైవ కుటుంబం నిజమైన భారతీయ స్ఫూర్తితో, 24 విదేశీ దేశాల నుండి 2,200 మందికి పైగా  ఎన్‌సీసీ  క్యాడెట్లు, యువ క్యాడెట్లు ఈ సంవత్సరం ర్యాలీలో భాగం కానున్నారు.

ప్రత్యేక అతిథులుగా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 400 మందికి పైగా వైబ్రంట్ గ్రామాల సర్పంచ్‌లు, 100 మందికి పైగా వివిధ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు కూడా  ఎన్‌సీసీ పీఎం ర్యాలీకి హాజరవుతారు.

 



(Release ID: 2000402) Visitor Counter : 90