ప్రధాన మంత్రి కార్యాలయం

బాలాసాహెబ్ ఠాకరే గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొన్న ప్రధాన మంత్రి 

Posted On: 23 JAN 2024 9:22AM by PIB Hyderabad

బాలాసాహెబ్ ఠాకరే గారి కి ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు. బాలాసాహెబ్ ఠాకరే గారు ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి అని, మహారాష్ట్ర యొక్క రాజకీయాల పైన మరియు మహారాష్ట్ర యొక్క సాంస్కృతిక ముఖచిత్రం మీద ఆయన ప్రసరింప చేసిన ప్రభావం సాటిలేనటువంటిది గా ఉంటుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘బాలాసాహెబ్ ఠాకరే గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. ఆయన ఒక సమున్నతమైనటువంటి వ్యక్తి, మహారాష్ట్ర రాజకీయాల పైన మరియు సాంస్కృతిక ముఖచిత్రం మీద ఆయన ప్రసరింప చేసిన ప్రభావం సాటి లేనటువంటిది గా ఉంటుంది. లెక్కపెట్టలేనంత మంది ప్రజల యొక్క హృదయాల లో ఆయన సజీవం గా ఉన్నారు అంటే అందుకు ఆయన అందించిన నాయకత్వం, ఆయన ఆదర్శాల పట్ల మొక్కవోని సమర్పణ భావం లతో పాటు గా పేద లు మరియు అణగారిన వర్గాల వారి పక్షాన ఎలుగెత్తి పలికిన ఆయన నిబద్ధత కూడా కారణం.’’ అని పేర్కొన్నారు.

 

*********

DS/ST



(Release ID: 1998806) Visitor Counter : 83