ప్రధాన మంత్రి కార్యాలయం

కేరళలోని త్రిప్రయార్‌లోగల శ్రీ రామస్వామి ఆలయంలో ప్రధానమంత్రి దైవ దర్శనం.. పూజలు

Posted On: 17 JAN 2024 5:44PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కేర‌ళ‌లోని త్రిప్ర‌యార్‌లోగల శ్రీ రామ‌స్వామి ఆలయంలో దైవదర్శనం చేసుకుని, పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, వారితోపాటు వటువులను కూడా సత్కరించారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘త్రిప్రయార్ శ్రీ రామస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రార్థనలు చేశాను. మలయాళంలో శ్రీ అధ్యాత్మ రామాయణం, ఇతర సంకీర్తనా శ్లోక పఠనం నాకు శ్రవణానందం కలిగించాయి. ఇది నాకెంతో ప్రత్యేకమైన సందర్భం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

 

***

DS/TS



(Release ID: 1997158) Visitor Counter : 63