ప్రధాన మంత్రి కార్యాలయం

కువైత్  యొక్క క్రొత్త అమీరు కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 20 DEC 2023 10:22PM by PIB Hyderabad

కువైత్ కు క్రొత్త అమీరు గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన శ్రీ శేఖ్ మెశాల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

భారతదేశం-కువైత్ సంబంధాలు భవిష్యత్తు లో బలోపేతం అవుతాయని, తద్ద్వారా మధ్య ప్రాచ్య ప్రాంత దేశం లో భారతీయ సముదాయం వర్ధిల్లుతుందన్న విశ్వాసాన్ని కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘కువైత్ కు అమీరు గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు గాను శ్రీ శేఖ్ మెశాల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబా కు ఇవే శుభాకాంక్షలు, అభినందనలూ ను. రాబోయే సంవత్సరాల లో మన యొక్క సంబంధాలు మరింత గా బలపడడం తో పాటు గా కువైత్ లో భారతీయ సముదాయం వర్ధిల్లుతూ ఉండడం కొనసాగించగలదన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1989046) Visitor Counter : 74