ప్రధాన మంత్రి కార్యాలయం
కువైట్ అధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం
Posted On:
16 DEC 2023 9:39PM by PIB Hyderabad
కువైట్ అధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు కువైట్ రాచ కుటుంబానికి, నాయకత్వానికి, ప్రజలకు ఆయన సంతాపం తెలియజేయడంతోపాటు సానుభూతి ప్రకటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘కువైట్ దేశాధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను కలచివేసింది. ఈ నేపథ్యంలో రాచకుటుంబానికి, దేశ నాయకత్వానికి, ప్రజలకు నాతోపాటు భారత ప్రజల తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1987432)
Visitor Counter : 87
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam