ప్రధాన మంత్రి కార్యాలయం

కువైట్ అధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం

Posted On: 16 DEC 2023 9:39PM by PIB Hyderabad

   కువైట్ అధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

   ఈ మేరకు కువైట్ రాచ కుటుంబానికి, నాయకత్వానికి, ప్రజలకు ఆయన సంతాపం తెలియజేయడంతోపాటు సానుభూతి ప్రకటించారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:

‘‘కువైట్ దేశాధినేత గౌరవనీయ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా తుదిశ్వాస విడిచారన్న వార్త నన్ను కలచివేసింది. ఈ నేపథ్యంలో రాచకుటుంబానికి, దేశ నాయకత్వానికి, ప్రజలకు నాతోపాటు భారత ప్రజల తరఫున ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1987432) Visitor Counter : 67