ప్రధాన మంత్రి కార్యాలయం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం

Posted On: 01 DEC 2023 7:55PM by PIB Hyderabad

    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 1న ‘యుఎఇ’లో కాప్-28 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు మాననీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు.

   కాప్-28 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడంపై గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను ప్రధానమంత్రి అభినందించారు. అలాగే కాప్-28 వేదికపై హరిత వాతావరణ కార్యక్రమం (జిసిపి)పై ఉన్నతస్థాయి కార్యక్రమానికి సహాధ్యక్షత వహించడంపైనా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

   ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల విస్తృత-శక్తివంతమైన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అలాగే ఇజ్రాయెల్-హమాస్ వివాదంపైనా వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, వ‌చ్చే నెల‌ ‘ఉజ్వల గుజ‌రాత్’ సదస్సు నిర్వహణ నేపథ్యంలో భారత పర్యటనకు రావాల్సిందిగా మ‌హ్మ‌ద్ బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్‌ను ప్ర‌ధానమంత్రి ఆహ్వానించారు.

****



(Release ID: 1981802) Visitor Counter : 78