ప్రధాన మంత్రి కార్యాలయం

గుజరాతీల కు నూతనసంవత్సర శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి

Posted On: 14 NOV 2023 10:57AM by PIB Hyderabad

గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ క్రొత్త ఏడాది శుభాకాంక్షల ను తెలిపారు.

 

ప్రపంచం అంతటా క్రొత్త ఏడాది ని వేడుక గా జరుపుకొంటున్న వారందరి కి ఇవే ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేస్తూ ‘‘ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి ఏడాది గా ఉండింది; దీనికి కారణం మీరంతా కలసి వోకల్ ఫార్ లోకల్ ప్రచార ఉద్యమాన్ని గొప్ప గా విజయవంతం అయ్యేటట్టు చేయడమే.

 

స్థానికంగా తయారైన వస్తవుల ను కొనుగోలు చేయడం ద్వారా, నూతన సంవత్సరం తన సరిక్రొత్త కాంతి ని వ్యాపింప చేసింది.

 

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం రాబోయే సంవత్సరాల లో సైతం ఇదే విధమైనటువంటి ఉత్సాహం తో స్థానిక ఉత్పాదనల కు మనం అండగా నిలబడతామని సంకల్పాన్ని చెప్పుకొందాం రండి’’ అని పేర్కొన్నారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

 ‘‘ప్రపంచ వ్యాప్తం గా నూతన సంవత్సరాన్ని వేడుక గా జరుపుకొంటున్న నా కుటుంబ సభ్యులు అందరి కి క్రొత్త ఏడాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి ఏడాది గా ఉండింది; దీనికి కారణం మీరు అందరు కలసి వోకల్ ఫార్ లోకల్ ప్రచార ఉద్యమాన్ని గొప్పగా విజయవంతం చేయడమే. స్థానికం గా తయారు అయినటువంటి ఉత్పాదనల ను కొనుగోలు చేయడం ద్వారా, నూతన సంవత్సరం ఒక కొత్త తళుకుల ను విస్తరింప చేసింది. అదే అభివృద్ధి చెందిన భారతదేశం. రాబోయే సంవత్సరాల లో ‘వికసిత్ భారత్’ ను ఆవిష్కరించడం కోసం ఇదే విధమైనటువంటి ఉత్సాహం తో మనం అందరమూ స్థానికం గా తయారు అయిన ఉత్పాదనల నే కొనుగోలు చేయాలన్న సంకల్పాన్ని చెప్పుకొందాం, రండి.’’ అని పేర్కొన్నారు.

******

Dhiraj Singh



(Release ID: 1976847) Visitor Counter : 84