ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ చాంపియన్స్ ట్రాఫి 2023 లో బంగారు పతకాన్ని గెలిచినందుకు భారతదేశంమహిళల హాకీ జట్టు కు ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 06 NOV 2023 6:23PM by PIB Hyderabad

ఏశియాన్ చాంపియన్స్ ట్రాఫి 2023 లో భారతదేశం మహిళల హాకీ జట్టు పసిడి పతకాన్ని గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ జట్టు ను ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘భారతదేశం యొక్క నారీ శక్తి మరో మారు రాణించింది.


ఏశియాన్ చాంపియన్స్ ట్రాఫి 2023 లో ప్రతిష్టాత్మక స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు మన అద్భుతమైనటువంటి హాకీ జట్టు కు అభినందన లు. వారి యొక్క అసాధారణమైనటువంటి నేర్పు, ఊగిసలాట కు తావు ఇవ్వని అటువంటి ఉద్వేగం మరియు దృఢ సంకల్పం తో నిండినటువంటి వారి యొక్క శ్రేష్ఠమైన ఆటతీరు నిజాని కి మన హృదయాల ను గర్వం తో నింపిడిపోయేటట్లుగా చేసివేసింది.


అంతర్జాతీయ రంగస్థలం మీద దేశం యొక్క కీర్తి ని ఇనుమడింప జేసినందుకు విజేత ల కు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS



(Release ID: 1975366) Visitor Counter : 120