ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్ త్రో -F37లో హనీ స్వర్ణపతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం

Posted On: 25 OCT 2023 4:42PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల జావెలిన్  త్రో -F37 ఈవెంట్  లో స్వర్ణపతకం గెలుచుకున్న హనీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.  

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘హనీ అద్భుత విజయం సాధించాడు. ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల జావెలిన్  త్రో -F37 ఈవెంట్  లో స్వర్ణపతకం సాధించాడు.

అతను ప్రదర్శించిన సరిపోల్చడానికి వీలులేని నైపుణ్యం భారత్  కు అవధులు లేని సంతోషం, గర్వం తెచ్చింది. రాబోయే క్రీడా వేడుకల్లో కూడా అతను ఇదే తరహా విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1971893) Visitor Counter : 69