ప్రధాన మంత్రి కార్యాలయం

పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల డబుల్స్ కాంపౌండ్ ఈవెంట్‌లో పారా ఆర్చర్స్ శీతల్ దేవి, సరిత రజత పతకం సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు

Posted On: 25 OCT 2023 6:54PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో మహిళల డబుల్స్ కాంపౌండ్ ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న పారా ఆర్చర్స్ శీతల్ దేవి,సరితను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్టు చేస్తూ.. 
“మహిళల డబుల్స్ కాంపౌండ్ ఈవెంట్‌లో అద్భుతమైన రజత పతకాన్ని సాధించినందుకు మన పారా ఆర్చర్స్, శీతల్ దేవి, సరిత కు అభినందనలు. ఈ  విజయాన్ని భారతదేశం వేడుకగా జరుపుకుంటుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 



(Release ID: 1971770) Visitor Counter : 40