ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో రజత పతకం సాధించిన రింకూకు ప్రధాని అభినందన

Posted On: 25 OCT 2023 9:22PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-46’లో రజత పతకం సాధించిన రింకూను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-46’లో రింకూ అద్భుత విన్యాసంతో రజత పతకం సొంతం చేసుకోవడంపై అభినందిస్తున్నాను. భవిష్యత్తులోనూ అతడు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971760) Visitor Counter : 86