ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీ. టి-11’లో రజత పతక విజేత లలిత కిల్లాకకు ప్రధాని అభినందన

Posted On: 25 OCT 2023 9:41PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో రజత పతక విజేత లలిత కిల్లాకను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ సందర్భంగా ఆమె పట్టుదల, ప్రదర్శించిన అద్భుత విన్యాసం అబ్బురపరిచాయని ఆయన అభివర్ణించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ మహిళల ‘1500 మీటర్ల టి-11’లో లలిత కిల్లాక రజతం సాధించడం మనమంతా గర్వించాల్సిన సందర్భం. మొక్కవోని ఆమె దీక్ష, అసమాన ప్రతిభ ఎంతో ప్రశంసనీయం. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971757) Visitor Counter : 74