ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ ‘జావెలిన్ త్రో’ స్వర్ణ పతక విజేత సుందర్ సింగ్ గుర్జర్కు ప్రధాని అభినందన

Posted On: 25 OCT 2023 9:15PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘జావెలిన్‌ త్రో ఎఫ్‌-46’లో స్వర్ణ పతకం సాధించిన సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. గుర్జర్‌ అపూర్వ ప్రతిభను ఆయన ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ జావెలిన్ త్రో ఎఫ్‌-46లో అద్భుత నైపుణ్యంతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుందర్‌ సింగ్‌ గుర్జర్‌ @SundarSGurjarకు అభినందనలు. ఇదెంతో అపురూప  విజయం. ఆయన ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1971753) Visitor Counter : 65