ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ ‘జావెలిన్ త్రో’ స్వర్ణ పతక విజేత సుందర్ సింగ్ గుర్జర్కు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
25 OCT 2023 9:15PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘జావెలిన్ త్రో ఎఫ్-46’లో స్వర్ణ పతకం సాధించిన సుందర్ సింగ్ గుర్జర్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు. గుర్జర్ అపూర్వ ప్రతిభను ఆయన ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ జావెలిన్ త్రో ఎఫ్-46లో అద్భుత నైపుణ్యంతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సుందర్ సింగ్ గుర్జర్ @SundarSGurjarకు అభినందనలు. ఇదెంతో అపురూప విజయం. ఆయన ఇంకా మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971753)
आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam