ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో  మహిళల పారా కనూకెఎల్2 ఈవెంట్ లో బంగారు పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలవడం పట్ల సంతోషాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి   

Posted On: 24 OCT 2023 1:07PM by PIB Hyderabad

చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా నిర్వహించిన మహిళల కనూ కెఎల్2 ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని ప్రాచీ యాదవ్ గారు గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు అభినందనల ను తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -


‘‘పారా కనూ విమెన్స్ కెఎల్2 ఈవెంట్ లో ప్రతిష్టాత్మకమైన పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రాచీ యాదవ్ గారి కి ఇవే అభినందన లు. ఇది ఎటువంటి అసాధారణమైన ప్రదర్శన అంటే ఇది భారతదేశం గర్వపడేటట్లు గా చేసింది. భావి ప్రయాసల లో సైతం ప్రాచీ యాదవ్ గారు రాణించాలి అని కోరుకొంటూ శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1970911) Visitor Counter : 68