ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘హైజంప్‌- టి47’లో స్వర్ణం సాధించిన నిషాద్‌ కుమార్‌కు ప్రధాని అభినందన

Posted On: 23 OCT 2023 5:39PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్‌- టి47’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత క్రీడాకారుడు నిషాద్‌కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల హైజంప్‌-టి47’లో అద్భుతంగా రాణించి ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన నిషాద్‌ కుమార్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అతని అసమాన ప్రతిభ, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ చరిత్రాత్మక విజయంపై దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉప్పొంగుతున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1970871) Visitor Counter : 47