ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘హైజంప్- టి47’లో స్వర్ణం సాధించిన నిషాద్ కుమార్కు ప్రధాని అభినందన
Posted On:
23 OCT 2023 5:39PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్- టి47’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత క్రీడాకారుడు నిషాద్కుమార్ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పురుషుల హైజంప్-టి47’లో అద్భుతంగా రాణించి ప్రతిష్టాత్మక స్వర్ణ పతకం సాధించిన నిషాద్ కుమార్కు నా హృదయపూర్వక అభినందనలు. అతని అసమాన ప్రతిభ, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. ఈ చరిత్రాత్మక విజయంపై దేశ ప్రజలంతా ఆనందోత్సాహాలతో ఉప్పొంగుతున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1970871)
Visitor Counter : 47
Read this release in:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil