ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడోత్సవాలు పురుషుల డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ కు పిఎం అభినందనలు

Posted On: 24 OCT 2023 8:46PM by PIB Hyderabad

ఆసియా పారా క్రీడోత్సవాలు పురుషుల డిస్కస్  త్రో- F54/55/56 ఈవెంట్  లో స్వర్ణ పతకం సాధించిన  నీరజ్  యాదవ్  ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధానమంత్రి అతన్ని అసలైన చాంపియన్  గా పేర్కొంటూ యాదవ్  చెక్కు చెదరని కట్టుబాటును, ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘నీరజ్  యాదవ్  అసలైన చాంపియన్.

పురుషుల డిస్కస్  త్రో- F54/55/56 ఈవెంట్ లో అద్భుతమైన స్వర్ణ పతకం సాధించినందుకు నీరజ్  యాదవ్  కు అభినందనలు. ఈ అద్భుతమైన విజయం అతనిలోని చెక్కు చెదరని కట్టుబాటును, ప్రయత్నాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విసయంతో భారతదేశం గర్వంతో ఉప్పొంగుతోంది’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1970846) Visitor Counter : 93