ప్రధాన మంత్రి కార్యాలయం

మాతృ ప్రేమ కు సంకేతం అయిన స్కందమాత దేవి ని ఆమె ఆశీస్సులకై ప్రార్ధించిన ప్రధాన మంత్రి

Posted On: 19 OCT 2023 9:00AM by PIB Hyderabad

తల్లి ప్రేమ ను అందించే దేవత అయినటువంటి స్కందమాత దేవి యొక్క దీవెన లు ఆ దేవి భక్తజనులు అందరికి ప్రాప్తించాలి అనే ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

దేవత ప్రార్థన పాఠాన్ని (స్తుతి ని) కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశంలో -

‘‘నవరాత్రుల లో ఈ రోజు న, మమత కు ప్రతీక అయినటువంటి దేవి స్కందమాత ను విశేషం గా పూజించడం జరుగుతుంది. దేవి మాత తన భక్తజనావళి కి నవ చైతన్యం మరియు నవ సృజన ల తాలూకు ఆశీర్వాదాల ను అందించు గాక.. ఇదే నేను కోరేది.’’ అని పేర్కొన్నారు.

 



(Release ID: 1969149) Visitor Counter : 85