ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
సర్వజన సంక్షేమం ఆకాంక్షిస్తూ దుర్గామాతకు ప్రార్థన
Posted On:
15 OCT 2023 8:44AM by PIB Hyderabad
పవిత్ర నవరాత్రి వేడుకలు ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పర్వదినం నేపథ్యంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యాన్నివ్వాలని దుర్గామాతను ప్రార్థించారు. నవరాత్రి ఉత్సవాలు మొదలైన సందర్భంగా ప్రజలందరి సంక్షేమం ఆకాంక్షిస్తూ ఆ శైలపుత్రి పాదాలకు శ్రీ మోదీ నమస్కరించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా వివిధ భాషల్లో పంపిన వరుస సందేశాల్లో:
“దేశప్రజలందరికీ నవరాత్రి శుభాకాంక్షలు… శక్తి ప్రదాయని అయిన ఆ దుర్గామాత ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టంతోపాటు చక్కని ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. జై దుర్గామాత!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1967859)
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam