ప్రధాన మంత్రి కార్యాలయం

ఎర్రకోట నుంచి తన ప్రసంగంలో చేసిన ప్రకటనలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2023 2:20PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా చేసిన ప్రకటనలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఈ ప్రసంగం చేసిన ఆయన, పేద-మధ్యతరగతి గృహాల నిర్మాణం కోసం రుణ సౌలభ్యం కల్పిస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ ప్రకటన అమలు సంబంధిత సన్నాహాలను సమావేశంలో ప్రధాని సమీక్షించారు.

   అలాగే గృహాలకు సౌర విద్యుత్తు సరఫరా గురించి కూడా తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని ప్రస్తావించారు. ఈ పథకం అమలు సంబంధిత ఏర్పాట్లను కూడా ప్రధాని సమీక్షించారు.



(Release ID: 1965491) Visitor Counter : 109