ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో చిరస్మరణీయ స్వర్ణం గెలుచుకున్న వెన్నం జ్యోతి సురేఖకు ప్రధాని అభినందన

Posted On: 07 OCT 2023 8:33AM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతక విజేత వెన్నం జ్యోతి సురేఖను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“భారతదేశం గర్వంతో ఉప్పొంగిన మరో సందర్భమిది! ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీలో ముచ్చటగా మూడో స్వర్ణంతో మెరిసిన మన బంగారు తల్లి వెన్నం జ్యోతి సురేఖ @VJSurekhaకు నా అభినందనలు. ఆమె అంకితభావం, దృఢ సంకల్పం, గురితప్పని ఏకాగ్రత భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1965322) Visitor Counter : 79