ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల పురుషుల గ్రీకో-రోమన్ కుస్తీ 87 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన సునీల్ కుమార్ను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 04 OCT 2023 7:20PM by PIB Hyderabad

   సియా క్రీడల పురుషుల గ్రీకో-రోమన్‌ కుస్తీ 87 కిలోల విభాగంలో కాంస్యం కైవసం చేసుకున్న సునీల్‌ కుమార్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో పురుషుల గ్రీకో-రోమన్ కుస్తీ 87 కిలోల విభాగంలో కాంస్యం పతకం సాధించిన సునీల్ కుమార్‌కు హృదయపూర్వక అభినందనలు! ఇదొక విశిష్ట విజయం… భవిష్యత్తులో అతడు మరిన్ని విలువైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1964508) Visitor Counter : 99