ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల జావెలిన్లో స్వర్ణ పతకం సాధించిన అన్నూ రాణికి ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 03 OCT 2023 10:05PM by PIB Hyderabad

   సియా క్రీడల మహిళల జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న భారత క్రీడాకారిణి అన్నూరాణిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో మనకు మరో స్వర్ణం! మహిళల జావెలిన్ త్రో పోటీలో అన్నూరాణి అత్యుత్తమ ప్రతిభా ప్రదర్శనతో మెరవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ పసిడి పతకం యావత్‌ భారతాన్నీ గర్వంతో ఉప్పొంగేలా చేసింది! ఆమె ఎల్లప్పుడూ అత్యున్నత లక్ష్యాలను సాధిస్తూ మనందరికీ స్ఫూర్తిప్రదాతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS



(Release ID: 1963940) Visitor Counter : 88