ప్రధాన మంత్రి కార్యాలయం

ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ 54 కిలోల విభాగంలో కాంస్య పతక విజేత ప్రీతి పవార్కు ప్రధానమంత్రి అభినందన

Posted On: 03 OCT 2023 9:34PM by PIB Hyderabad

   సియా క్రీడ‌ల‌ మ‌హిళ‌ల బాక్సింగ్‌ 54 కిలోల విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించిన భారత బాక్స‌ర్ ప్రీతి ప‌వార్‌ను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ 19 ఏళ్ల యువతి ప్రతిభను చూసి గర్విస్తున్నానని, తానెంచుకున్న క్రీడలో అంకితభావం, నిలకడ, మొక్కవోని దీక్షకు ఆమె సాధించిన ఈ విజయం సంకేతమని ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ప్రతిభావంతురాలైన మన బాక్సర్‌ మహిళల బాక్సింగ్‌ 54 కిలోల విభాగంలో భారతదేశానికి కాంస్యం పతకం తెచ్చిపెట్టింది. ఆమె ప్రతిభా ప్రదర్శన నన్ను గర్వపడేలా చేసింది. ఈ క్రీడలో ఆమె అంకితభావం, నిలకడ, మొక్కవోని దీక్షకు ఈ విజయం ఒక నిదర్శనం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/RT



(Release ID: 1963932) Visitor Counter : 81