ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని పలక్ గారుగెలుచుకొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
29 SEP 2023 2:16PM by PIB Hyderabad
హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్ లో పసిడి పతకాన్ని పలక్ గారు గెలుచుకొన్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘శూటింగ్ క్రీడ లో భారతదేశాని కి మరొక ప్రత్యేకమైనటువంటి క్షణం.
10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్ లో పలక్ గారు ఇచ్చిన ప్రశంసాయుతమైన ఆటతీరు కు మరియు పసిడి పతకాన్ని గెలిచినందుకు ఆమె కు ఇవే అభినందన లు. ఆమె చాటిన కచ్చితత్వం మరియు తదేక శ్రద్ధ మన దేశ ప్రజల కు ఎంతో గర్వకారణం గా నిలచాయి. ఆమె భావి ప్రయాసల లో సైతం రాణించాలని నేను అభిలషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1962562)
సందర్శకుల సూచీ సంఖ్య : : 122
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam