ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల్లో మహిళల ఉషు-సాండా 60 కిలోల విభాగంలో రజత పతక విజేత రోషిబినా దేవి నవోరెమ్కు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 28 SEP 2023 11:03AM by PIB Hyderabad

సియా క్రీడల్లో మహిళల ఉషు- సాండా 60 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన రోషిబినా దేవి నవోరెమ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“అంకితభావం, అపార ప్రతిభగల మన రోషిబినా దేవి నవోరెమ్ ఉషు-మహిళల సాండా 60 కిలోల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. కఠోర దీక్ష, అవిశ్రాంత శ్రమతో ఆమె ప్రదర్శించిన క్రీడా పటిమ అద్భుతం. ఆమె క్రమశిక్షణ, సంకల్పం ప్రశంసనీయం… ఆమెకు అభినందనలు.. శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1962110) आगंतुक पटल : 107
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Malayalam