ప్రధాన మంత్రి కార్యాలయం

ఏశియాన్ గేమ్స్2022 లో 50 మీటర్ ల రైఫిల్ 3పి ఈవెంట్ లో బంగారు పతకాన్ని పురుషుల జట్టుగెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 29 SEP 2023 10:09AM by PIB Hyderabad

హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మెన్స్ 50 ఎమ్ రైఫిల్ 3 పి స్ టీమ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని శ్రీయుతులు స్వప్నిల్ కుసాలే, ఐశ్వరి ప్రతాప్ సింహ్ తోమర్ మరియు అఖిల్ శ్యోరాణ్ లతో కూడిన జట్టు గెలవడం తో పాటు ప్రపంచ రికార్డు ను సైతం నెలకొల్పినందుకు గాను వారికి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో,

‘‘ఒక బ్రహ్మాండమైనటువంటి విజయం, ప్రతిష్టాత్మకమైన బంగారు పతకం తో పాటు ప్రపంచ రికార్డు కూడాను. ఏశియాన్ గేమ్స్ లో మెన్స్ 50 ఎమ్ రైఫిల్ 3 పి స్ టీమ్ ఈవెంట్ లో శ్రీయుతులు స్వప్నిల్ కుసాలే, ఐశ్వరి ప్రతాప్ సింహ్ తోమర్ మరియు అఖిల్ శ్యోరాణ్ లతో కూడిన జట్టు విజేత గా నిలచినందుకు గాను వారికి ఇవే అభినందన లు. వారు అసాధారణమైనటువంటి దృఢసంకల్పాన్ని మరియు టీమ్ వర్కు ను చాటారు.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1962052) Visitor Counter : 93