ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హొయసలుల పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడంపై ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 18 SEP 2023 9:19PM by PIB Hyderabad

   హొయసలుల పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా యునెస్కో పోస్ట్‌ చేసిన సందేశాన్ని ప్రజలతో పంచుకుంటూ:

“భారతదేశానికి ఇదెంతో గర్వకారణం! హొయసలుల అద్భుత పవిత్ర కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేర్చింది. హొయసల రాజులు నిర్మించిన ఆలయాల సౌందర్యం వాటిపై చెక్కిన సున్నిత శిల్పరూపాలు భారత సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలు. అంతేకాదు.. మన పూర్వికుల అత్యద్భుత కళా నైపుణ్యానికి ప్రతీకలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1958724) आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam