ప్రధాన మంత్రి కార్యాలయం

మరో మైలురాయిని సాధించిన శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 31 AUG 2023 9:45PM by PIB Hyderabad

మరో మైలు రాయిని సాధించినందుకు శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు. దేశీయంగా రూపుదిద్దుకున్న గుజరాత్లోని అతిపెద్ద, 700 ఎం.డబ్ల్యుఇ కక్రాపార్ అణువిద్యుత్ కేంద్రం
 మూడో యూనిట్ పూర్తి సామర్థ్యంతో న కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ పెడుతూ, ‘‘ఇండియా మరో మైలు రాయిని అధిగమించింది.
దేశీయ పరిజ్ఞానంతో గుజరాత్ లో రూపుదిద్దుకున్న అతిపెద్ద 700 ఎం.డబ్ల్యు.ఇ కక్రాపార్ అణువిద్యుత్ ప్లాంట్ యూనిట్ 3 పూర్తి స్థాయి సామర్ధ్యంతో తన కార్యకలాపాలు ప్రారంభించింది.  ఇందుకు శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు నా అభినందనలు ”అని ప్రధానమంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1953948) Visitor Counter : 148