ప్రధాన మంత్రి కార్యాలయం

ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 25 AUG 2023 10:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.


ప్రధాన మంత్రి తన ప్రసంగం లో, ప్రస్తుతం భారతదేశం లో జరుగుతున్న అపూర్వ పరివర్తనల ను గురించి మరియు వివిధ రంగాల లో భారతదేశం వేస్తున్నటువంటి ముందంజలను గురించి ప్రస్తావించారు. చంద్రయాన్ మిశన్ యొక్క సాఫల్యాన్ని ఆయన ప్రశంసించారు.


భారతదేశం, గ్రీస్ ల బహుముఖ సంబంధాల ను ముందుకు తీసుకు పోవడం లో గ్రీస్ లో భారతీయ సముదాయం అందిస్తున్న తోడ్పాటు ను గురించి ఆయన ప్రముఖం గా ప్రకటించి, భారతదేశం యొక్క వృద్ధి గాథ లో పాలుపంచుకోవాలంటూ వారికి విజ్ఞప్తి చేశారు.

 

 

***



(Release ID: 1952956) Visitor Counter : 85