ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచ అండర్‌-20 కుస్తీపోటీ-2023 విజేతగా నిలిచిన భారత మహిళా మల్లయోధుల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 19 AUG 2023 6:48PM by PIB Hyderabad

   ప్రపంచ అండర్‌-20 కుస్తీ పోటీలు-2023లో విజయం సాధించిన భారత మహిళా మల్లయోధుల జట్టును ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“భారత మహిళా వస్తాదులకు ఇదొక చరిత్రాత్మక విజయం! మన జట్టు 2023 అండర్‌-20 ప్రపంచ కుస్తీ పోటీల్లో అసమాన ప్రతిభా ప్రదర్శనతో 3 స్వర్ణాలు సహా 7 పతకాలు సాధించి టీమ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముఖ్యంగా అంతిమ్‌ పంఘాల్‌ రెండోసారి విజయంతో తన టైటిల్‌ను నిలబెట్టుకుని, ఈ ఘనత సాధించిన తొలి రెజ్లర్‌గా నిలిచింది! మన వర్ధమాన మల్లయోధుల అచంచల నిబద్ధత, దృఢ సంకల్పం, అసాధారణ ప్రతిభకు ఈ అద్భుత విజయం ప్రతిరూపం” అని ప్రధానమంత్రి కొనియాడారు.

 

***

DS



(Release ID: 1950677) Visitor Counter : 137