ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రపంచం శీతోష్ణస్థితి సంకటాలతోతంటాలు పడుతుంటే, మనం దారి ని చూపి, లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మంట్ – ‘మిశన్ ఎల్ఐఎఫ్ఇ’కార్యక్రమాన్ని ప్రారంభించామన్న ప్రధాన మంత్రి

Posted On: 15 AUG 2023 5:08PM by PIB Hyderabad

ఈ రోజు న 77వ స్వాతంత్ర్య దినం సందర్భం లో న్యూ ఢిల్లీ లోని చరిత్రాత్మక ఎర్ర కోట బురుజుల మీది నుండి దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, జి20 శిఖర సమ్మేళనం కోసం మనం ‘‘ఒక ప్రపంచం, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’’ భావన ను ముందుకు తీసుకు వచ్చాం మరి ఆ దిశ లో పాటుపడుతున్నాం’’ అన్నారు. ప్రపంచం శీతోష్ణ స్థితి సంబంధి సంకటాల తో తంటాలు పడుతూ ఉంటే, మనం ఉపాయాన్ని ఇచ్చి లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మంట్ మిశన్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని ఆయన చెప్పారు.

ప్రపంచం యొక్క సమన్వయం తో మనం ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ ను ఏర్పాటు చేశాం. మరి అనేక దేశాలు ఇప్పుడు ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్ లో భాగం అయ్యాయి అని ప్రధాన మంత్రి అన్నారు. జీవ వైవిధ్యం యొక్క ప్రాముఖ్యాన్ని చాటిచెప్పడం తో పాటుగా ‘‘బిగ్ కేట్ అలయన్స్’’ ఏర్పాటు ను కూడా వేగవంతం చేశాం అని ఆయన అన్నారు.

***



(Release ID: 1949078) Visitor Counter : 177