ప్రధాన మంత్రి కార్యాలయం
పదవీ కాలంలో తొలి ఏడాది పూర్తి చేసుకున్న రాష్ట్రపతికి ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
25 JUL 2023 8:12PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతిగా శ్రీమతి ద్రౌపదీ ముర్ము తొలి ఏడాది పదవీకాలం పూర్తిచేసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి ట్వీట్ను ప్రజలతో పంచుకుంటూ పంపిన సందేశంలో:
““రాష్ట్రపతి గారూ… మీ పదవీ కాలంలో తొలి సంవత్సరం పూర్తి చేసుకోవడంపై మీకు నా అభినందనలు! ప్రజాసేవలో మీరు చూపే అలుపెరుగని అంకితభావం, ప్రగతి దిశగా మీ నిరంతర కృషి ఎంతో స్ఫూర్తిదాయకం. మీరు సాధించిన వివిధ విజయాలు మీ నాయకత్వ ప్రభావాన్ని ప్రస్ఫుటం చేస్తాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1942659)
సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam