ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎనిమిదోసారి ఆసియా కబడ్డీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన

నాడు పోస్టు చేయడమైనది: 01 JUL 2023 2:42PM by PIB Hyderabad

   సియా కప్‌ కబడ్డీ చాంపియన్‌ షిప్‌లో 8వ సారి విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“అద్భుతమైన మన కబడ్డీ జట్టు 8వ సారి ఆసియా కబడ్డీ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలవడం ఎంతో అభినందనీయం! అసాధారణ ప్రతిభ, సమష్టి కృషితోపాటు వారు సిసలైన క్రీడాస్ఫూర్తిని  ప్రదర్శించారు. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(రిలీజ్ ఐడి: 1936783) సందర్శకుల సూచీ సంఖ్య : : 231