ప్రధాన మంత్రి కార్యాలయం

అమరులైన శాంతి సైనికుల ను గౌరవించుకోవడానికని ఒకక్రొత్త స్మారక కుడ్యాన్ని స్థాపించాలంటూ భారతదేశం ప్రతిపాదించిన తీర్మానాన్నిస్వీకరించిన ఐక్య రాజ్య సమితి సాధారణ సభ

Posted On: 15 JUN 2023 9:24AM by PIB Hyderabad

అమరులు అయిన శాంతి సైనికుల ను సమ్మానించుకోవడం లో భాగం గా ఒక క్రొత్త స్మారక కుడ్యాన్ని స్థాపించాలి అంటూ భారతదేశం ప్రతిపాదించిన తీర్మానాన్ని ఐక్య రాజ్య సమితి సాధారణ సభ స్వీకరించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శాంతిసైనికుల ను సత్కరించుకోవడం కోసం ఒక క్రొత్త స్మారక గోడ ను స్థాపించడానికి సంబంధించి భారతదేశం ప్రతిపాదించినటువంటి ఒక తీర్మానాన్ని ఐక్య రాజ్య సమితి సాధారణ సభ స్వీకరించినట్లు తెలుసుకొని సంతోషించాను. ఈ తీర్మానాని కి రికార్డు స్థాయి లో 190 సహ ప్రాయోజకత్వాలు లభించాయి. అందరి సమర్థన కు గాను కృతజ్ఞుడి ని.’’ అని పేర్కొన్నారు.

 

*******

DS/ST



(Release ID: 1932699) Visitor Counter : 159